Skip to main content

డిగ్రీ రిజిస్ట్రేషన్ల గడువు సెప్టెంబర్ 8 వరకు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి ఓ ప్రకటనలో తెలిపారు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల 7తో ముగిసిందని, అయితే విద్యార్థుల కోసం 8వ తేదీన కూడా అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మంగళవారమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు మంగళవారమే చివరి గడువు అని స్పష్టం చేశారు.
Published date : 08 Sep 2020 07:12PM

Photo Stories