Skip to main content

అనుమతిలేని ‘ఫార్మా టెక్నాలజీ’ కోర్సుల్లో చేరితే రిజిస్ట్రేషన్‌ చేయం: టీఎస్‌ ఔషధ మండలి

సాక్షి, హైదరాబాద్‌: భారత ఔషధ మండలి(పీసీఐ)అనుమతిలేని ‘ఫార్మా టెక్నాలజీ’కోర్సులో చేరితే.. కోర్సు పూర్తైన తర్వాత వారికి రిజిస్ట్రేషన్‌ చేయబోమని తెలంగాణ రాష్ట్ర ఔషధ మండలి ప్రకటించింది.
1948 ఫార్మసీ చట్టం ప్రకారం డిఫార్మ్, ఫార్మ్‌డి, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులకు పీసీఐ అనుమతి ఉందని తెలిపింది. ఫార్మసీ కోర్సులు, కళాశాలలకు పీసీఐ గుర్తింపు ఉండాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయా కళాశాలల్లో కోర్సులు పూర్తిచేస్తేనే వారికి రిజిస్టర్డ్‌ ఫార్మాసిస్టుగా గుర్తించి సర్టిఫికెట్‌ జారీ చేస్తామని స్పష్టం చేసింది.
Published date : 30 Aug 2021 03:35PM

Photo Stories