Skip to main content

Tennis: మనామా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ ఎక్కడ జరిగింది?

Ramkumar Ramanathan

భారత టెన్నిస్‌ స్టార్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ ఏడో ప్రయత్నంలో అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. నవంబర్‌ 29న బహ్రెయిన్‌ రాజధాని మనామాలో జరిగిన మనామా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ–2021లో రామ్‌కుమార్‌ టైటిల్‌ గెలిచాడు. సింగిల్స్‌ విభాగం ఫైనల్లో రామ్‌కుమార్‌ 6–1, 6–4తో ఎవ్‌గెనీ కార్లొవ్‌స్కీ (రష్యా)పై నెగ్గాడు.

సాత్విక్‌ సాయిరాజ్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు భారత పురుషుల డబుల్స్‌ స్టార్‌జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి అర్హత సాధించింది. తద్వారా ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌–1000 టోర్నీకి అర్హత పొందిన తొలి భారత పురుషుల జంటగా నిలిచింది. 2021, డిసెంబర్‌ 1న ఇండోనేసియాలోని బాలిలో మొదలయ్యే ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప బరిలో ఉన్నారు.
చ‌ద‌వండి: భారత క్రీడాకారుడు సౌరవ్‌ గోషాల్‌ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మనామా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ–2021లో టైటిల్‌ గెలిచిన భారతీయుడు?
ఎప్పుడు : నవంబర్‌ 29
ఎవరు    : భారత టెన్నిస్‌ స్టార్‌ రామ్‌కుమార్‌ 
ఎక్కడ    : మనామా, బహ్రెయిన్‌
ఎందుకు : సింగిల్స్‌ విభాగం ఫైనల్లో రామ్‌కుమార్‌ 6–1, 6–4తో ఎవ్‌గెనీ కార్లొవ్‌స్కీ (రష్యా)పై నెగ్గడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 30 Nov 2021 04:14PM

Photo Stories