Skip to main content

Paris Olympics: ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం సాధించిన‌ స్వప్నిల్ కుసాలే

పారిస్ ఒలింపిక్స్‌-2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే కాంస్య పతకం గెలిచాడు.
Swapnil Kusale shoots bronze, India's 3rd medal at the Paris Olympics

ఈ విజయంతో భారత్‌ ఈ ఒలింపిక్స్‌లో మొత్తం మూడు పతకాలను సాధించింది.

ఆగ‌స్టు 1వ తేదీ 8 మందితో జరిగిన ఫైనల్ రౌండ్‌లో భారత షూటర్ స్వప్నిల్‌ కుసాలే మొత్తం 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా ఈయ‌న చరిత్ర సృష్టించాడు.

చైనాకు చెందిన లియు యుకున్ 463.6 పాయింట్లతో బంగారు పతకాన్ని, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హి కులిష్ 461.3 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.  

Manu Bhaker: 124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌.. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు..

Published date : 01 Aug 2024 06:22PM

Photo Stories