Skip to main content

Mixed Doubles: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం సాధించిన శ్రీ కృష్ణ ప్రియ, తరుణ్‌

శాన్‌ సాల్వడార్‌ వేదికగా జరిగిన ఈఎల్‌ సాల్వడార్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారతీయ క్రీడాకారులు కుదరవల్లి శ్రీకృష్ణ ప్రియ, కోన తరుణ్‌లు సత్తా చాటారు.

నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు జరిగిన ఈ టోర్నీలో డబుల్స్‌ ద్వయం శ్రీకృష్ణ ప్రియ, తరుణ్‌లు రజత పతకం సాధించారు. ఈ ఇద్దరు క్రీడాకారులు చివరి 16 రౌండ్‌లో మెలి్వన్‌ కాల్జాడిల్లా, గాబ్రియేలా బారియోస్‌లను 21–7, 21–8 పాయింట్లతో ఓడించారు. క్వార్టర్స్‌లో వారు రెండో సీడ్‌ జోడీ గ్వాటెమాల క్రిస్టోఫర్‌ అలెగ్జాండర్, మరియానా ఇసాబెల్‌లను చిత్తు చేసి, వారి నాల్గవ టోర్నమెంట్‌లో స్పానిష్‌ జోడి అనియా సెటియన్, జోనాస్‌ మన్రాయ్‌ల చేతిలో 21–11, 21–17 పాయింట్లతో ఓడిపోయి రజతాన్ని సాధించారు. 

BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి గాయత్రి జోడీ

Published date : 06 Dec 2022 02:00PM

Photo Stories