Skip to main content

Shubman Gill: ఐసీసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌’గా గిల్‌

టీమిండియా నయా సంచలన బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్ 2023 జనవరి నెలకు గాను 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' గా ఎంపికయ్యాడు.

జ‌నవ‌రి 2023లో శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో ఒక డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలతో సహా మొత్తం 567 పరుగులు చేసిన భారత ఓపెనర్‌ గిల్‌. కాన్వే (న్యూజిలాండ్‌), సహచరుడు సిరాజ్‌లను వెనక్కినెట్టి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. గతంలో భారత్‌ నుంచి పంత్, అశ్విన్, భువనేశ్వర్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌ ఈ అవార్డు గెల్చుకున్నారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (22-28 జనవరి 2023)

Published date : 14 Feb 2023 05:21PM

Photo Stories