Skip to main content

Badminton: ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన భారతీయురాలు?

PV Sindhu

ఫిలిప్పీన్స్‌ రాజధాని నగరం మనీలా వేదికగా జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2022 మహిళల సింగిల్స్‌ విభాగంలో భారతీయ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు) కాంస్య పతకం గెలిచింది. ఏప్రిల్‌ 30న జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21–13, 19–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో పోరాడి ఓడింది. ఫలితంగా కాంస్యం దక్కింది. సెమీఫైనల్లో ఓడిన సింధుకు 5,800 డాలర్ల (రూ. 4 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీ, 8,400 పాయింట్లు లభించాయి. ఈ మెగా ఈవెంట్‌లో 2014 ఏడాదిలోనూ సింధు కాంస్య దక్కించుకుంది.

24th Deaflympics: బధిరుల ఒలింపిక్స్‌కు ఎంపికైన టెన్నిస్‌ క్రీడాకారిణి?

ఆరూ కాంస్యాలే..
ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు లభించిన పతకాలు ఆరు. ఈ ఆరూ కాంస్యాలే కావడం గమనార్హం. మీనా షా (1956) ఒకసారి... సైనా నెహ్వాల్‌ (2010, 2016, 2018) మూడుసార్లు... సింధు (2014, 2022) రెండుసార్లు కాంస్యాలు నెగ్గారు.
GK Persons Quiz: సెర్దార్ బెర్డిముహమెడో ఏ దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌–2022 మహిళల సింగిల్స్‌ విభాగంలో కాంస్యం గెలిచిన భారతీయ క్రీడాకారిణి?
ఎప్పుడు : ఏప్రిల్‌ 30
ఎవరు    : పూసర్ల వెంకట సింధు(పీవీ సింధు)
ఎక్కడ    : మనీలా, ఫిలిప్పీన్స్‌
ఎందుకు : మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో సింధు 21–13, 19–21, 16–21తో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో పోరాడి ఓడిపోవడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 May 2022 01:09PM

Photo Stories