Skip to main content

Nationa Games 2022 : ఏపీ, తెలంగాణకు పతకాలు

జాతీయ క్రీడల్లో అక్టోబర్ 2న తెలంగాణకు ఒక రజత పతకం లభించింది.
National Games 2022: Medals for AP, Telangana
National Games 2022: Medals for AP, Telangana

మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్‌ స్కీట్‌ ఈవెంట్‌ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్‌  25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది. బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్‌–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది. 

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలో అక్టోబర్ 2న రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్‌.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్‌ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్‌ చేరింది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 03 Oct 2022 08:13PM

Photo Stories