Skip to main content

Anahat Singh: బ్రిటిష్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నీ విజేత అనాహత్‌ సింగ్‌

ప్రతిష్టాత్మక బ్రిటిష్‌ జూనియర్‌ ఓపెన్‌ స్క్వాష్ టోర్నీలో అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విభాగంలో భారత అమ్మాయి అనాహత్‌ సింగ్‌ విజేతగా నిలిచింది.

బర్మింగ్‌హామ్‌లో జ‌న‌వ‌రి 8వ తేదీ జరిగిన ఫైనల్లో అనాహత్‌ 11–8, 8–11, 11–7, 11–5తో సొహైలా హజీమ్‌ (ఈజిప్ట్‌)పై గెలిచింది. 14 ఏళ్ల అనాహత్‌ బ్రిటిష్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గడం ఇది రెండోసారి. 2019లో ఆమె అండర్‌–11 విభాగంలో టైటిల్‌ సాధించింది. గతంలో భారత్‌ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్‌ మాత్రమే బ్రిటిష్‌ ఓపెన్‌ జూనియర్‌ టోర్నీలో విజేతలుగా నిలిచారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Published date : 09 Jan 2023 05:35PM

Photo Stories