రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో FLoating Solar Plant
![PM Modi dedicated Ramagundam 100 megawatt floating](/sites/default/files/images/2022/08/02/solar-plant-2-ramagundam-1659426636.jpg)
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్ను ప్రధాని నరేంద్రమోదీ జూలై 30న వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాకతీయ ఫంక్షన్హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Also read: Tobacco - New Warnings : సిగరెట్ ప్యాకెట్లు తదితరాలపై కొత్త హెచ్చరిక, బొమ్మ