Skip to main content

Veteran Journalist: ఇటీవల కన్నుమూసిన పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డీ?

Vinod Dua

దూరదర్శన్‌ ద్వారా దేశవ్యాప్తంగా చిరపరిచితమైన ప్రముఖ పాత్రికేయులు వినోద్‌ దువా(67) అనారోగ్యంతో డిసెంబర్‌ 4న ఢిల్లీలో కన్నుమూశారు. తన 42ఏళ్ల పాత్రికేయ జీవితంలో ఎన్నో జనరంజక టెలివిజన్‌ కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించారు. వినోద్‌ను కేంద్రప్రభుత్వం 2008లో పద్మశ్రీతో సత్కరించింది.

సంసద్‌ టీవీ షో నుంచి వైదొలిగిన ఎంపీ?

రాజ్యసభలో అనుచిత ప్రవర్తన ఆరోపణలపై తనతో సహా 12 మంది సభ్యులను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ సంసద్‌ టీవీ షో ‘మేరీ కహానీ’యాంకర్‌ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రకటించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

లోక్‌సభ, రాజ్యసభల కార్యకలాపాలతోపాటు ఇతర ప్రజా సంబంధ కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సంసద్‌ టీవీ’చానెల్‌ను నిర్వహిస్తోంది. ఈ చానెల్‌లో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘టు ది పాయింట్‌’ అనే కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తుండగా... ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి     :
ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్‌ 4
ఎవరు    : వినోద్‌ దువా(67)
ఎక్కడ    : ఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Dec 2021 11:25AM

Photo Stories