PM కేర్స్ ట్రస్టీగా రతన్ టాటా
![Ratan Tata nominated as trustee of PM Cares Fund](/sites/default/files/images/2022/09/22/ratan-tata-1663849365.jpg)
కరోనా నేపథ్యంలో అత్యవసర సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏర్పా టైన పీఎం కేర్స్ నిధికి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, జస్టిస్ కేటీ థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా ట్రస్టీలుగా వ్యవహరించనున్నారు.
Also read: CMIE Reports: నిరుద్యోగం పైపైకి.. యువత, మహిళలపై తీవ్ర ప్రభావం
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన ట్రస్టు బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పీఎంఓ వెల్లడించింది. ప్రస్తుత ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులతో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. మాజీ కాగ్ రాజీవ్ మెహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తి, పారిశ్రామికవేత్త ఆనంద్ షా సభ్యులుగా ఉంటారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP