Skip to main content

Darshan Singh: దర్శన్‌ సింగ్‌కు ప్రవాసీ సమ్మాన్‌ అవార్డు

విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్‌ సింగ్‌ దలీవాల్‌కు ప్రదానం చేశారు.

పంజాబ్‌లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్‌తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇండోర్‌లో జ‌రిగిన‌ 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ సదస్సుకు ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్‌ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్‌ ఇర్ఫాన్‌ అలీ హాజరయ్యారు.
భారత్‌లోనే చదివా.. గయానా అధ్యక్షుడు
భారత్‌ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్‌లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్‌ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్‌ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు. 

 

Published date : 10 Jan 2023 01:54PM

Photo Stories