Skip to main content

Minister Piyush Goyal: దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఎక్కడ ఏర్పాటైంది?

Food Museum

తమిళనాడు రాష్ట్రం తంజావూరులో దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ఏర్పాటైంది. తంజావూరులోని ఎఫ్‌సీఐ డివిజనల్‌ కార్యాలయం పక్కన రూ. 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మ్యూజియాన్ని నవంబర్ 15న కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్‌ టెక్నలాజికల్‌ మ్యూజియంతో కలిసి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) దీనిని ఏర్పాటు చేసింది. ఇక్కడి వివిధ విభాగాలు ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేలా ఉన్నాయి. దేశంలో రైతు నుంచి ఎఫ్‌సీఐ గోదాముల వరకు జరిగే ఆహార సేకరణ ప్రక్రియను వర్చువల్ రియాలిటీ ద్వారా వీక్షించే సదుపాయం కల్పించారు. కాలానుగుణంగా మారుతూ వచ్చిన నిర్మాణ, వ్యవసాయ పద్ధతుల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆహార నిల్వలపై ఆధునిక పద్ధతులను తెలుసుకునేందుకు వీలుగా ‘క్విజ్‌ జోన్‌’ ఏర్పాటు చేశారు. ఆహారం కోసం వేట నుంచి వ్యవసాయం వైపు మొగ్గుచూపిన తీరును తెలుసుకోవచ్చు.

చ‌ద‌వండి: 56వ డీజీపీల సదస్సును ఏ నగరంలో నిర్వహించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలోనే తొలి ఆహార మ్యూజియం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు  : కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ 
ఎక్కడ : తంజావూరు, తంజావూరు జిల్లా తమిళనాడు
ఎందుకు : ఆహారంపై విజ్ఞానాన్ని పెంచేందుకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Nov 2021 07:09PM

Photo Stories