Skip to main content

Supreme Court: రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు?

Supreme Court

దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి 11న వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. మరోవైపు కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం ఇప్పుడు రాజస్తాన్‌కు సైతం పాకింది.

కర్ణాటక హైకోర్టు మధ్యంతర తీర్పు..

హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు ఫిబ్రవరి 11న అందుబాటులోకి వచ్చింది. ‘‘ప్రతి పౌరుడు తమకు ఇష్టమైన వస్త్రాలను ధరించటం, విశ్వాసాలను అనుసరించటం రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు అయినా వాటిపై పూర్తి స్వేచ్ఛ లేదు. అవి రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉంటాయి’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది. తుది తీర్పు వెల్లడించేంత వరకు సంప్రదాయ వస్త్రాలతో విద్యా సంస్థలకు హాజరుకారాదని పేర్కొంది.

చ‌ద‌వండి: ఓఈసీఎమ్‌ గుర్తింపును పొందిన దేశంలోని తొలి పార్కు?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 Feb 2022 03:59PM

Photo Stories