Skip to main content

Mahatma Gandhi: గాంధీ స్మారక నాణెన్ని విడుదల చేసిన దేశం?

Gandhi Coin

దీపావళి పర్వదినం పురస్కరించుకుని మహాత్మా గాంధీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ నవంబర్‌ 4న ఈ నాణెన్ని ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ప్రభావవంతమైన నాయకుడికి ఇది ఘనమైన నివాళి అని మంత్రి రిషి సునక్‌ పేర్కొన్నారు. భారత్‌ ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌...

హీనా గ్లోవర్‌ అందించిన ఆకృతిలో రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌’ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది. బ్రిటన్‌ రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌లో వీటిని అమ్మకానికి పెట్టారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : మహాత్మా గాంధీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. ఐదు పౌండ్ల స్మారక నాణెన్ని విడుదల చేసిన దేశం? 
ఎప్పుడు : నవంబర్‌ 4
ఎవరు    : బ్రిటన్‌ 
ఎందుకు : భారత్, బ్రిటన్‌ మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని...

చ‌ద‌వండి: పెగాసస్‌ స్పైవేర్‌పై ఆంక్షలు విధించిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Nov 2021 04:42PM

Photo Stories