Skip to main content

Union Cabinet: పీఎంకేఎస్‌వై గడువును ఎప్పటిదాకా పొడిగించారు?

PMKSY

ప్రధాన్‌మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై) పథకాన్ని 2026దాకా పొడిగిస్తూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ డిసెంబర్ 15న నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు జాతీయ ప్రాజెక్టులయిన హిమాచల్‌ ప్రదేశ్‌లోని రేణుకాజీ డ్యామ్‌ ప్రాజెక్ట్, ఉత్తరాఖండ్‌లోని లఖ్వర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌లకు 90 శాతం నిధులు మంజూరు చేసేందుకు మార్గం సుగమమైంది. దీంతో 22 లక్షల మంది రైతుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. దీంతోపాటే యమున నది బేసిన్‌లో నీటి నిల్వ సాధ్యమవుతుంది. యమునా ఎగువ బేసిన్‌లోని ఆరు రాష్ట్రాలకు లబ్ధిచేకూరనుంది. హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ సహా ఢిల్లీకి నీటి సరఫరా బాగా మెరుగుపడుతుంది. యమునా నది పునరుజ్జీవనానికి ఇది ముందడుగు అని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

ఎన్నికల సంస్కరణలకు ఆమోదం..

దేశ ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. బోగస్‌ ఓట్లను తొలగించడం కోసం ఓటర్‌ ఐడీని ఆధార్‌ కార్డుతో స్వచ్ఛందంగా లింకు చేయడం, ఏడాదికి నాలుగుమార్లు కొత్త ఓటర్లకు ఓటు నమోదు అవకాశం ఇవ్వడంతో పాటు సర్వీసు ఓటర్లకు సంబంధించిన సంస్కరణలు ఈ బిల్లులో ఉన్నాయి.
చ‌ద‌వండి: ఏడీబీ అంచనాల ప్రకారం.. 2021–22లో భారత్‌ వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రధాన్‌మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్‌వై)ను 2026దాకా పొడిగిస్తూ  నిర్ణయం 
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు    : కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 
ఎందుకు : నీటి సరఫరా ప్రాజెక్ట్‌లకు నిధులు మంజూరు చేసేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Dec 2021 04:44PM

Photo Stories