Skip to main content

విశాఖపట్నంలో డేటా సెంటర్ ‌ ఏర్పాటు చేయనున్న సంస్థ?

విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్‌ పార్క్‌ నెలకొల్పేందుకు వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (వీటీపీఎల్‌) పేరిట అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.
Current Affairs దీని అధీకృత మూలధనం రూ. 5 లక్షలుగా ఉంటుందని పేర్కొంది. విశాఖలో సమీకృత డేటా సెంటర్‌ పార్క్‌తో పాటు టెక్నాలజీ/బిజినెస్‌ పార్క్‌ అభివృద్ధి చేసే లక్ష్యంతో వీటీపీఎల్‌ ఏర్పాటైందని అదానీ తెలిపింది.

తెలంగాణలో ఓ రహదారి ప్రాజెక్టు అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం కోదాడ ఖమ్మం రోడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మరో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు అదానీ సంస్థ తెలిపింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (వీటీపీఎల్‌) పేరిట అనుబంధ సంస్థ ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్‌ 1
ఎవరు : అదానీ ఎంటర్‌ప్రైజెస్‌
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
ఎందుకు : విశాఖపట్నంలో డేటా సెంటర్, బిజినెస్‌ పార్క్‌ నెలకొల్పేందుకు
Published date : 02 Apr 2021 06:40PM

Photo Stories