Skip to main content

Human Rights Commission: ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటు కానుంది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని కర్నూలు నగరంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఆగస్టు 27న విడుదల చేసింది. ఏపీ హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయ కేంద్రంగా కర్నూలును ప్రకటిస్తున్నట్లుగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయాన్ని త్వరలో కర్నూలుకు తరలించనున్నారు.

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డెక్స్‌టర్‌ కన్నుమూత
ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి టెడ్‌ డెక్స్‌టర్‌ (86) ఆగస్టు 25న అనారోగ్యంతో మృతి చెందారు. 1958–1968 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ తరఫున 62 టెస్టులు ఆడిన ఆయన 47.89 సగటుతో 4502 పరుగులు చేశారు. ఇందులో 9 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2021 ఏడాదే డెక్స్‌టర్‌కు ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో చోటు దక్కింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ఏ నగరంలో ఏర్పాటు కానుంది?
ఎప్పుడు : ఆగస్టు 27
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయం మేరకు...
Published date : 28 Aug 2021 06:04PM

Photo Stories