ఆయుర్వేద మందులపై అమెరికన్ల పరిశోధనలు
Sakshi Education
ఆయుర్వేదం మందులపై పరిశోధనలు ప్రారంభించేందుకు భారత్లోని ఆయుర్వేద వైద్యులు, శాస్త్రవేత్తలతో అమెరికన్ శాస్త్రవేత్తలు కలిసి పనిచేయనున్నారు.
![Current Affairs](/sites/default/files/images/2020/07/10/Ayurveda1.jpg)
ఈ విషయాన్ని వాషింగ్టన్లోని భారతీయ దౌత్యవేత్త తరన్జీత్ సింగ్ సంధూ తెలిపారు. భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలతో జూలై 8న ఆన్లైన్ సమావేశం నిర్వహించిన తరన్జీత్ ఈ మేరకు వెల్లడించారు. ఉమ్మడి పరిశోధనల ద్వారా ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని ఇరుదేశాల శాస్త్రవేత్తలు నిర్ణయించారన్నారు. కోవిడ్ చికిత్సకువాడే ఆయుర్వేద మందులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. కోవిడ్ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఇండో యూఎస్ సైన్స్ టెక్నాలజీ ఫోరమ్ ప్రయత్నిస్తోందని తరన్జీత్ వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయుర్వేద మందులపై పరిశోధనలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : భారతీయ, అమెరికన్ శాస్త్రవేత్తలు
ఎందుకు : ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయుర్వేద మందులపై పరిశోధనలు
ఎప్పుడు : జూలై 9
ఎవరు : భారతీయ, అమెరికన్ శాస్త్రవేత్తలు
ఎందుకు : ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని
Published date : 10 Jul 2020 05:22PM