Skip to main content

Sri Sathya Sai Award: తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి శ్రీసత్యసాయి అవార్డు

విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం ఇత‌ర‌ రంగాల్లో సేవలందిస్తున్న ఏడుగురు మహిళలకు ‘శ్రీ సత్యసాయి అవార్డ్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌’ పురస్కారాలను అందజేశారు.

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీప ముద్దేనహళ్లిలో నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు శ్రీ మధుసూదన్‌సాయి ఈ పురస్కారాలు అందించారు.  వీరిలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ డాక్టర్‌ నీర్జా బిర్లా, దివ్యాంగ క్రీడాకారిణి మాలతి హొళ్లా, ఒడిశాకు చెందిన డాక్టర్‌ తులసీ ముండా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కౌశల్య బాయి, తమిళనాడుకు చెందిన ఆర్‌.రంగమ్మాళ్, న్యాయవాది గౌరీ కుమారి ఉన్నారు. గ‌త ఏడు సంవ‌త్స‌రాల నుంచి విద్య, ఆరోగ్యం, పర్యావరణం, స్త్రీ, శిశు సంక్షేమం, మతాల ఐక్యత, సంగీతం, లలిత కళలు, యోగా, క్రీడా రంగాల్లో సేవ‌లందించిన వారికి ఈ పుర‌స్కారాల‌ను అందిస్తున్నారు.

➤ చిరంజీవికి అరుదైన గౌరవం.. మోదీ ప్ర‌త్యేక అభినంద‌న‌లు

Published date : 25 Nov 2022 05:30PM

Photo Stories