British Prime Minister's Points of Light award: బ్రిటన్లో భారత సంతతి బాలికకు ప్రతిష్టాత్మక పురస్కారం
Sakshi Education
భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్ బాలిక మోక్షారాయ్ ప్రతిష్టాత్మక బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డును గెలుచుకుంది.
Moksha Roy
మైక్రోప్లాస్టిక్ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్ ఉపప్రధాని ఆలివర్ డౌడెన్ బాలికకు అవార్డును అంజేశారు.