Skip to main content

AP EDCET 2024 Notification: ఏపీ ఎడ్‌సెట్‌–2024కు అప్లై చేశారా? దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..

AP EDCET 2024 Notification

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌)–2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. బీఈడీ, బీఈడీ(స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్‌ సెట్ నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. బీటెక్, బీసీఏ, బీబీఎం విద్యార్థులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష విధానం: మొత్తం 150 ప్రశ్నలు మూడు విభాగాల నుంచి ఉంటాయి. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 15.05. 2024
ఆలస్య రుసుము రూ. 1000తో దరఖాస్తుకు చివరి తేది: మే 16-19 వరకు
ఆలస్య రుసుము రూ. 2000తో దరఖాస్తుకు చివరి తేది: మే 21 వరకు

దరఖాస్తు సవరణ తేదీలు: 22.05.2024 నుంచి 25.05.2024 వరకు
హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌ తేది: 30.05.2024.
ప్రవేశ పరీక్ష తేది: 08.06.2024. 
వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/
 

Published date : 08 May 2024 03:54PM

Photo Stories