JNTUA: జేఎన్‌టీయూకు ఐఎస్‌ఓ గుర్తింపు

అనంతపురం సెంట్రల్‌: జేఎన్‌టీయూకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఆగ‌స్టు 22న‌ యూనివర్సిటీ కాన్ఫరెన్స్‌ హాలులో సర్టిఫికేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీ ఆచార్య సుదర్శన్‌రావు మాట్లాడుతూ జేఎన్‌టీయూకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ రావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో నాణ్యత ప్రమాణాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

చదవండి: WHO Notice : అత్యంత ఆందోళనకర స్థాయికి చేరుకున్న వైరస్‌.. డ‌బ్ల్యూహెచ్ఓ ప్ర‌క‌ట‌న!

కార్యక్రమంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రతినిధి ఆలపాటి శివయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య కృష్ణయ్య, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌ ఆచార్య దుర్గాప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, ఎంబీఏ విభాగాధిపతి నారాయణరెడ్డి పాల్గొన్నారు.

#Tags