Andhra Pradesh: 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఆంధ్రప్రదేశ్‌ రహదారుల చరిత్రలో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ.. రాష్ట్రంలో 1,380 కిలోమీటర్ల మేర చేపట్టిన 51 జాతీయ రహదారుల ప్రాజెక్టులలో 20 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరో 31 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. కృష్ణా జిల్లా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఫిబ్రవరి 17న నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా సంయుక్తంగా ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌ రెండో ఫ్లైఓవర్‌ను మంత్రి గడ్కరీ, సీఎం జగన్‌ ప్రారంభించారు.

 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags