Vantara: 3 వేల ఎకరాల్లో ‘వంతారా’

గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కార్యక్రమాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, రిలయన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ ఫిబ్రవరి 26న ప్రారంభించారు. వంతారా అనేది కృత్రిమ అడవి. దేశ, విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం ‘వంతారా’ ముఖ్య లక్ష్యం. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags