NMMS Exam in Odiya : ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష ఇక‌పై ఒడియాలో కూడా..!

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను ఒడియా మీడియంలోనూ ప్రశ్నపత్రం అందించాలని కోరారు అపోటా సంఘం ప్రతినిధులు..

కవిటి: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) ప్రతిభా పరీక్షను ఒడియా లింగ్విస్టిక్స్‌ విద్యార్థుల కోసం ఒడియా మీడియంలోనూ ప్రశ్నపత్రం అందించాలని ఏపీ ఒరియా టీచర్స్‌ అసోసియేషన్‌(అపోటా) సంఘం ప్రతినిధులు కోరారు. శనివారం శ్రీకాకుళంలో రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానంద రెడ్డిని అపోటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బృందావన్‌ దోళాయి, ఉత్తరాంధ్ర ఒడియా డీఐ దుర్గ ప్రసాద్‌ చౌధురీ కలిసి వినతి పత్రం అందజేశారు.

Private Teachers and Lecturers : ఉపాధ్యాయుల దినోత్స‌వం సంద‌ర్భంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కూ అవార్డులు ఇవ్వాలి..

ఈ సందర్భంగా అపోటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొళాయి మాట్లాడుతూ ఒరియాలోనూ ప్రశ్న పత్రం ఉంటే ఒరియా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒరియాలో అవకాశం లేకపో వడంతో చాలామంది ప్రతిభావంతులైన పిల్లలు అవకాశం కోల్పోతున్నారని తెలిపారు. పేద పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై డైరెక్టర్‌ దేవానంద రెడ్డి మాట్లాడుతూ అవసరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

Students Future : పిల్ల‌ల భ‌విష్య‌త్తు కొర‌కు పాఠ‌శాలను యధావిధిగా కొన‌సాగించాలి..

#Tags