Civil Services FAQs
ప్రిలిమ్స్ సబ్జెక్టుల వారీగా
- చరిత్ర: ఆధునిక చరిత్ర; జాతీయోద్యమం;ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చరిత్ర అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన– పరిపాలన విధానాలు;బ్రిటిష్కు వ్యతిరేక తిరుగుబాట్లు–ఉద్యమాలు(ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం),సంస్కరణోద్యమాలపై దృష్టి పెట్టాలి.
పాలిటీ
- రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
- రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, రిపబ్లికన్ ప్రభుత్వం, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
- పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం.
- ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన ఎలా జరుగుతుంది? అందులో ప్రముఖ భాగస్వాములెవరు? విధానాల అమలు, వాటి సమీక్ష. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన అంశాలు.
ఎకానమీ
- ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు–మూలధన వనరుల పాత్ర; ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం); ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో.. దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి; పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం; నీతి అయోగ్; బ్యాంకింగ్ రంగం, ప్రగతి–సంస్కరణలు; తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు; ఎకనామిక్ సర్వే, బడ్జెట్
సైన్స్ అండ్ టెక్నాలజీ
పరీక్షకు ముందు ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంభవిస్తున్న వ్యాధులు–కారకాలు; ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–అందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు; ఏడాది కాలంలో జరిగిన జాతీయ,అంతర్జాతీయ పరిణామాలు
టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం
- జూన్ 5న ప్రిలిమ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏప్రిల్ రెండు లేదా మూడో వారం వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ సబ్జెక్ట్లను అనుసంధానం చేసుకుంటూ చదవాలి.
- ఆ తర్వాత నుంచి ప్రిలిమ్స్ పరీక్ష తేదీ వరకూ పూర్తిగా ప్రిలిమ్స్ ప్రిపరేషన్, రివిజన్కు కేటాయించాలి.
- ఈ సమయంలో కనీసం మూడు మాక్ లేదా మోడల్ టెస్ట్లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది.
- ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్లను చదివే విధంగా సమయం విభజించుకోవాలి.
- ప్రతి చాప్టర్/యూనిట్ పూర్తయిన తర్వాత అందులోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి.
- పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి అంతకు ముందు ఏడాది వ్యవధిలో జరిగిన ముఖ్యమైన సమకాలీన అంశాలపై పట్టు సాధించాలి.
యూపీఎస్సీ ప్రతి ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మక పరీక్ష.. సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే.. పట్టుదలతో ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించాలి. వెయ్యిలోపు ఉద్యోగ ఖాళీలుంటే.. ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఇంత తీవ్ర పోటీ ఉండే సివిల్స్ పరీక్షకు సిద్ధమవ్వాలంటే.. ఎంతో ముందుచూపు, ప్రణాళిక ఉండాలి. చాలామంది అభ్యర్థులు సివిల్స్లో విజయం సాధించాలంటే.. టాప్ ఇన్స్టిట్యూట్స్లో చదివి ఉండాలేమో.. రోజుకు 18 గంటలు చదవాలేమో.. కోచింగ్ తీసుకుంటేనే సక్సెస్ అవుతామా.. ఇలా అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికోసం సివిల్స్ పరీక్ష గురించిన అపోహలు.. వాస్తవాలు...
అపోహ: సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే.. ప్రతిరోజూ 15–18 గంటలు తప్పనిసరిగా చదవాలి?
వాస్తవం: ఏడాది పొడవునా రోజుకు 15–18 గంటలు చదువు కొనసాగించడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎన్ని గంటలు చదివామనే దాని కంటే.. విషయాన్ని ఎంత బాగా ఆకళింపు చేసుకున్నామన్నదే ముఖ్యం అంటున్నారు నిపుణులు, టాపర్స్. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు కనీసం ఆరేడు గంటలు నిద్రపోవాలి. నిద్ర సరిగా ఉంటేనే.. చదువుపై ఏకాగ్రత కుదురుతుంది.కాబట్టి గంటలు గంటలు పుస్తకాల ముందు కూర్చోవడం కంటే.. ఏకాగ్రతతో చదవడం ముఖ్యమని గుర్తించాలి.
అపోహ: ఉన్నత విద్యావంతులు మాత్రమే సివిల్స్ పరీక్షలో సక్సెస్ అవుతారు?
వాస్తవం: యూపీఎస్సీ సివిల్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చిన ఉన్నత విద్యావంతులు మాత్రమే విజయం సాధిస్తారు అనేది వాస్తవం కాదు. సంప్రదాయ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంతోమంది ప్రతిఏటా సివిల్స్లో సక్సెస్ అవుతున్నారు. హార్డ్వర్క్, సాధించాలనే తపన, పట్టుదలతోపాటు సహనం ఉంటే ఎవరైనా సివిల్స్ సాధించవచ్చు.
అపోహ: ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులే సివిల్స్లో విజయం సాధిస్తారు?
వాస్తవం: విభిన్న నేపథ్యాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ప్రోత్సహిస్తుంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో.. ఏదైనా భాషలో పరీక్ష రాసేందుకు, ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చేందుకు అనుమతి ఉంది. కాబట్టి అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో అభిప్రాయాలను సరళంగా, సూటిగా రాయడం, చెప్పడం సాధన చేస్తే సరిపోతుంది. అయితే ప్రామాణిక పుస్తకాలు ఎక్కువగా ఇంగ్లిష్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇంగ్లిష్పై అవగాహన పెంచుకుంటే.. పరీక్ష ప్రిపరేషన్లో కచ్చితంగా దోహదపడుతుందని చెప్పొచ్చు.
అపోహ: సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ప్రతీదీ తెలిసుండాలి?
వాస్తవం: సివిల్స్ సిలబస్ విస్తృతమైనది. వైవిధ్యమైనది. కాబట్టి ముందుగా సిలబస్ను అధ్యయనం చేసి.. పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్ను గుర్తించాలి. ఆయా ప్రాధాన్య అంశాల గురించి వివరంగా తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. సరైన దిశలో ప్రిపరేషన్ సాగించాలి. 50శాతం నుంచి 60 శాతం సిలబస్పై పట్టు సాధించగలిగినా.. విజయం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
అపోహ: కోచింగ్ లేకుండా సివిల్స్ పరీక్షలో విజయం సాధించలేం?
వాస్తవం: కోచింగ్ అనేది పరీక్ష తీరుతెన్నుల గురించి కొంత దిశానిర్దేశం చేస్తుంది. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ప్రతి ఏటా ఎంతో మంది సివిల్స్లో ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో స్టడీ మెటీరియల్, నిపుణుల సలహాలు వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రణాళికబద్ధంగా ప్రిపరేషన్ సాగించడం ద్వారా ఈ పరీక్షలో విజయం సొంతం చేసుకోవచ్చు. నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం, సరైన వ్యూహంతో సివిల్ సర్వీసెస్ కలను నిజం చేసుకోవచ్చు.
దీనివల్ల అభ్యర్థులు రియల్ ఎగ్జామ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష రాయగలరు. మీరు రాస్తున్నది ప్రాక్టీస్ టెస్ట్గా కాకుండా, నిజమైన పరీక్షే అనుకుని రెండు గంటల సమయం పెట్టుకుని దాని ప్రకారం రాయండి. దీనివల్ల పరీక్షలో ఎలాంటి ఒత్తిడి ఉండదు. ప్రాక్టీస్ టెస్ట్ రాసిన తర్వాత ఈ కింది అంశాలను పరిశీలించాలి. అవి..
• ఎన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం తెలుసు?
• ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలియదు?
• సమాధానాలు గుర్తించడంలో ఎక్కడ ఇబ్బంది పడ్డారు?
• ఎన్ని ప్రశ్నలకు జవాబులు ఊహించాల్సి వచ్చింది?
• అంచనా ప్రకారం గుర్తించిన ప్రశ్నల్లో ఎన్ని సరైన సమాధానాలు?!!
తద్వారా మన బలాలు, బలహీనతలపై అవగాహన వస్తుంది.
ఈ సమయం సరిపోతుంది..
సమయం తక్కువగా ఉందని అభ్యర్థులు ఆందోళన చెందవద్దు. ప్రిలిమ్స్ రాసే ప్రతి అభ్యర్థి మీలాగే ఆలోచిస్తారని గుర్తుంచుకోండి. తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవ్వాలో, అందుకు ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయో గుర్తించి.. అందులో మీకు అనువైన మార్గాన్ని అనుసరించండి. సిలబస్లో మీరు కవర్ చేయని అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టండి. సిలబస్ ప్రకారం నోట్స్ రాసుకొని ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం సొంతమవుతుంది. ముఖ్యంగా ఈ తక్కువ సమయంలో ఎక్కువ ప్రాక్టీస్ పేపర్లకు సమాధానాలు గుర్తించడం ద్వారా సమయ పాలనతో పాటు ఏ విభాగంలో వెనుకబడ్డారో గుర్తించి, అందుకు తగ్గట్టుగా ప్రాక్టీస్ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది.
– వి.గోపాలకృష్ణ, బ్రెయి¯Œన్ ట్రీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
సివిల్ సర్వీసెస్.. దేశంలో క్రేజీ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 24 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అభ్యర్థుల ఎంపికకు ఏటా నిర్వహించే పరీక్ష! ‘కోవిడ్–19’ ప్రభావంతో మే నెలలో జరగాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్–2020 అక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. పరీక్షలు వాయిదా పడినా.. ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షలకు 50 రోజుల వ్యవధి ఉన్నందున సరైన ప్రణాళికతో చదవాలని సలహా ఇస్తున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రధానంగా ఎదురయ్యే సందేహాలకు నిపుణుల సమాధానాలు..
కొవిడ్ కారణంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడటంతో నా ప్రిపరేషన్ గందరగోళంలో పడింది. ఇప్పుడు మొదట చదివినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ రాయాలా, లేక ఈ అటెంప్ట్ వాయిదా వేసుకోవాలా?
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడటం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులను కలవరపరిచింది. సివిల్స్ మాత్రమే కాదు.. పోటీ పరీక్షలు రాసే అందరిదీ ఇదే పరిస్థితి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా దాదాపు 50 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలావరకు సిలబస్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ సమయాన్ని మరింతగా సద్వినియోగం చేసుకొని పరీక్షలు రాయడమే మంచిది.
- చాలామంది అభ్యర్థులకు పరీక్షలో అడిగిన ఓ అంశంపై బాగా అవగాహన ఉన్నప్పటికీ ఎస్సేను ఎలా ప్రారంభించాలో తెలియక సతమతమవుతారు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. అభ్యర్థులు ఎస్సేను ప్రారంభించేందుకు సమకాలీన శైలి (Contemporary Style)ని అనుసరించాలి. ఉదాహరణకు ప్రశ్న ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించినది అయితే ‘పుల్వామా దాడి’ ఘటనను ప్రస్తావిస్తూ ప్రారంభించొచ్చు.
- ఎస్సే ప్రారంభంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఎగ్జామినర్ను ఆకట్టుకోగలరు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్.. దీన్ని అభ్యర్థులు గుర్తుంచుకొని అడుగు వేయాలి. మొదటి పేజీ పేరాల్లో సరళమైన పదాలు, సూటిగా, స్పష్టమైన వివరణలు ఉండేలా చూడాలి. ఇతరులతో పోల్చితే భిన్నంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచన రేకెత్తించేవిగా ఉంటే ఎక్కువ మార్కులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
- వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు. ఎదురుగా ఉన్న వ్యక్తితో సంభాషిస్తున్నట్లు రాయాలి.
- ఎస్సేలో చేతిరాత కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల చాలా విషయాలను వ్యాసంలో ప్రస్తావించాలన్న తాపత్రయంతో గజిబిజిగా రాస్తే ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదముంది.
- ఎస్సేను పేరాగ్రాఫ్లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి. ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి.
- బాక్స్లు, ఫ్లో డయాగ్రమ్స్, పైచార్ట్లు వంటి వాటిని అవసరానికి తగ్గట్టు సముచితంగా ఉపయోగించాలి.
- ఎస్సేను ముగించే ముందు అప్పటివరకు రాసిన అంశాలను మరోసారి సరిచూసుకోవాలి. ప్రారంభంలో రాసిన దానికి, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి. ఈ ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి.
ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలు...
- ఎకోటోన్, కోరల్ బ్లీచింగ్, కార్బన్ ఫుట్ప్రింట్, ఫ్యూయల్ పావర్టీ వంటి జీవావరణ, పర్యావరణ సంబంధిత పదజాలం.
- జల, వాయు, ధ్వని, నేల తదితర కాలుష్యాలు-కారకాలు, ప్రభావం. ఆమ్లవర్షాలు, ఫొటోకెమికల్ స్మాగ్, గ్రీన్హౌస్ వాయువులు, ఓజోన్ పొరకు రంధ్రం, వ్యర్థాల నిర్వహణ.
- జీవవైవిధ్యానికి సంబంధించి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్).. రెడ్ డేటాబుక్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్.
- సహజ వనరుల పరిరక్షణ, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు, చిత్తడినేలలు, బయోస్పియర్ రిజర్వ్లు.
- పునరుత్పాదక ఇంధన వనరులు, జీవ ఇంధనాలు, జీవ క్రిమిసంహారకాలు తదితర అంశాలు.
- జీవావరణం పరంగా సున్నితమైన పశ్చిమకనుమలు, హిమాలయాలకు సంబంధించిన అంశాలు.
- వాతావరణ మార్పులు, కారణాలు, ప్రభావాలు, ఎదుర్కొనే చర్యలు, అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలు తదితర అంశాలు.
- పర్యావరణ పరిరక్షణ చట్టం, అటవీ చట్టం, జీవ వైవిధ్య చట్టం తదితర ప్రధాన చట్టాల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవాలి.
- యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) తదితర అంతర్జాతీయ సంస్థలు, కార్యాచరణ విభాగాల గురించి తెలుసుకోవాలి.
రిఫరెన్స్ :
- ఎన్సీఈఆర్టీ/సీబీఎస్ఈ ఆరు నుంచి 12 తరగతుల పుస్తకాలు. ఇగ్నో మెటీరియల్, ఎన్ఐఓఎస్ పుస్తకాలు, అధికారిక వెబ్సైట్లు.
అవి..
1. సమకాలీన ప్రాధాన్యం ఉన్న అంశాలు.
2. ప్రత్యేక లక్షణాలున్న అంశాలు.
- ఓ అంశాన్ని చదువుతున్నప్పుడు దాన్నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది.
ఉదా: శీతోష్ణస్థితి అనే అంశాన్ని చదువుతున్నప్పుడు ఒక ప్రాంతంలోని శీతోష్ణస్థితి అక్కడి ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. - భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, తుపాన్లు తదితరాలపై తొలుత శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. తర్వాత అవి ఎక్కడెక్కడ.. ఎందుకు? సంభవిస్తున్నాయో తెలుసుకోవాలి.
- మానవ జోక్యం వల్ల ఏ భౌగోళిక అంశాల్లో మార్పులు వస్తున్నాయి? వాటి ప్రభావం ఏమిటి? వంటి అంశాలపై దృష్టి సారించాలి. క్లుప్తంగా చెప్పాలంటే 'అభివృద్ధి-పర్యావరణం' కోణంలో చదవాలి.
- జాగ్రఫీ సిలబస్లోని మరొక కీలకాంశం- ముఖ్యమైన సహజ వనరుల విస్తరణ. దీని ప్రిపరేషన్లో భాగంగా సహజవనరుల్లో ప్రధానమైనవి, సమకాలీన (వివాదాల్లో ఉండటం వంటివి) ప్రాధాన్యం ఉన్నవి ఏమిటో గుర్తించాలి. ఏ రకమైన వనరులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి? అలా ఉండటానికి అనుకూలించిన పరిస్థితులు? తదితర విషయాలపై అవగాహన పొందాలి.
- ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి.. దానికి గల కారణాలేంటి? వనరుల విస్తరణకు, పరిశ్రమల అభివృద్ధికి మధ్య సంబంధాలను అధ్యయనం చేయాలి.
సివిల్స్ విజయంలో మెటీరియల్ ఎంపికది ఎంతో కీలక పాత్ర. ప్రస్తుతం ఒక సబ్జెక్ట్కు సంబంధించి పదుల సంఖ్య లో పుస్తకాలు, వెబ్ రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఆయా పుస్తకాలను ఎంపిక చేసుకునే ముందు సిలబస్లోని అన్ని అంశాలు ఉన్నాయా? లేవా? ఉంటే నిర్దిష్ట అంశంపై అన్ని కోణాల్లో సమాచారం ఉందా? అనేది పరిశీలించాలి. సమగ్ర సమాచారం ఉన్న మెటీరియల్నే ఎంపిక చేసుకోవాలి. ఒక అంశాన్ని విశ్లేషణాత్మకంగా, డిస్క్రిప్టివ్ విధానంలో చదివితే ఒకే సమయంలో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటికీ సన్నద్ధత లభిస్తుంది.
- 11, 12వ పంచవర్ష ప్రణాళికలు; ప్రభుత్వ రంగం- వనరుల సమీకరణకు ఆధారాలు; ఉపాధి రహిత వృద్ధి; శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు, లోటు బడ్జెట్ విధానం, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఉపాధిస్తంభన తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- 11, 12వ ప్రణాళికల పత్రాల్లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడం; సామాజిక అభివృద్ధి ద్వారా సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాలి. భారత్లో విద్య, ఆరోగ్య రంగాల స్థితిగతుల నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన అంశం ఆధారంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
- ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం. 2016-17 బడ్జెట్ను అధ్యయనం చేయాలి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, మూలధన రాబడి, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలపై పట్టు సాధించాలి.
- దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. భారత్లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలను తెలుసుకోవాలి. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి. భారత్లో భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవాలి.
అర్హత: ఏదైనా డిగ్రీ. అభ్యర్థి వయసు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
పరీక్ష విధానం:
- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ-శాట్).
- ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతాయి. ఒక్కో పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్ వంటి అంశాలపై జనరల్ స్టడీస్ పేపర్లో ప్రశ్నలు అడుగుతారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్ వంటి వాటిపై సీ-శాట్ పేపర్లో ప్రశ్నలు అడుగుతారు.
- మెయిన్ పరీక్ష: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పిలుస్తారు. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి పూర్తిస్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. ఇందులో తెలుగు కూడా ఉంది.
- ఇంటర్వ్యూ: - సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం, నాలెడ్జ్, విలువలను పరీక్షించే రీతిలో ప్రశ్నలు ఉంటాయి.
- సివిల్ సర్వీసెస్.. భారతదేశంలో జరిగే పరీక్షలన్నిటిలో కష్టమైంది. సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నిరంతర శ్రమ, కఠోర దీక్ష, పట్టుదల అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలన్నిటిపైనా నిరంతరం అప్డేట్ అవుతూ పట్టు సాధించాలి. నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ పెంచుకోవటం కోసం మేగజీన్లు చదవాలి. ఎక్కువ మోడల్ పేపర్ల సాధన ద్వారా స్పీడ్ను పెంచుకోవచ్చు. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ వంటివి ఆప్షనల్స్గా తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
వెబ్సైట్: www.upsc.gov.in
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఐండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్, ఎక్సైజ్), గ్రూప్-ఎ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పరీక్ష విధానం:
యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో
1) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్;
2) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష;
3) పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి.
సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపరుకు గరిష్టంగా 200 మార్కులు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటాయి.
సిలబస్: అంతర్జాతీయ, జాతీయ వర్తమాన అంశాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సన్ స్కిల్స్
ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. అన్నీ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని, పాలనాదక్షతను ఈ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.
అత్యంత క్లిష్టమైన పరీక్షగా సివిల్ సర్వీసెస్ను చెప్పుకోవచ్చు. దీనికోసం నిరంతర శ్రమ, అధ్యయనం తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. మేగజీన్లని చదవడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో వేగాన్ని పెంచుకోవచ్చు.
వెబ్సైట్: www.upsc.gov.in
అర్హత: డిగ్రీ. ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇతర సర్వీసులతో కలిసి ఉమ్మడిగా ముస్సోరిలో ఫౌండేషన్ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ఐఎఫ్ఎస్ అభ్యర్థులకు న్యూఢిల్లీలోని ఫారెన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో ఏడాది కాలంపాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే.. విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల పనితీరుపై అవగాహన కల్పించేలా విదేశీ పర్యటన, అక్కడ భారతీయ రాయబార కార్యాలయాలతో అటాచ్మెంట్ ఉంటుంది. విదేశీ వ్యవహారాలతోపాటు స్వదేశంలో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై అవగాహన ఏర్పరిచే దిశగా డిస్ట్రిక్ట్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది. వివరాల కోసం యూపీఎస్సీ వెబ్సైట్ www.upsc.gov.in చూడొచ్చు.
బ్యాచ్ : 2004
ర్యాంక్ : 28
ఇంటర్వ్యూ
మార్కులు : 201/300
సివిల్ సర్వీసును కెరీర్గా ఎందుకు ఎంచుకోవాలనుకుంటున్నావు?
జిల్లా కలెక్టైర్గా నీ ప్రాథమ్యాలు ఏంటీ?
పాలనలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకు?
స్వేచ్ఛ, సమాచార హక్కుకు మధ్య తేడా ఏంటీ?
భారతీయుడివైనందుకు గర్విస్తున్నానన్నావు కదా ? ఎందుకు?
నీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ పాలనలో ఏవిధంగా ఉపయోగపడుతుంది?
మహిళా సాధికారత గురించి నీకు ఏమి తెలుసు?
డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి?
బ్యాచ్ : 2006
ర్యాంక్ : 1
ఇంటర్వ్యూ
మార్కులు : 195/300
ఆర్ఈసీ వరంగల్ నుంచి బీ.టెక్., ఐఐఎస్సీ బెంగళూరు నుంచి ఎమ్.ఈ. చేశావు కదా. టెన్త్ అయిన తర్వాత డిప్లొమా ఎందుకు చదివావు?
నాలుగు నెలలు ఐపీఎస్ సర్వీసులో ఉన్నావు కదా. నేరాన్ని చూసినా సరే పోలీసు సాక్ష్యం చెల్లదు ఎందుకు?
ధ్యానం చేయడం... ఇతరుల్లో ప్రేరణ కల్గించడం... పురాణాల అధ్యయనం... ఇవన్నీ నీ హాబీలు కదా. ఇవన్నీ వ్యక్తి అంతర్ముఖ సంబంధిత అంశాల్లా నీకనిపించడంలేదా?
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివావు కదా. ప్రధాన సంఖ్యలను ఎక్కడ ఉపయోగిస్తారో చెప్పు?
ఉద్యోగం లేదా పరిశోధన కాకుండా సివిల్స్ను ఎందుకు లక్ష్యంగా ఎన్ను కున్నావు?
ఏదైనా ఒక సంఘటన జరిగితే.. బీడీఓ, డాక్టర్, పోలీసు వీరిలో ఎవరు ముందుగా స్పందించాలి?
బ్యాచ్ : 2006
ర్యాంక్ : 28
ఇంటర్వ్యూ
మార్కులు : 195/300
తత్వశాస్ర్తానికి, గణితానికి మధ్య ఉన్న సంబంధం?
గణితం, త త్వశాస్ర్తాల మధ్య సంబంధం ప్రాచీన సాహిత్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
అప్పట్లో సైన్సు సబ్జెక్టుల కంటే ఆర్ట్స్కు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకు?
రామాయణం, మహాభారతాలు చదివావు కదా. ప్రస్తుత సమాజానికి ఏది రిలవెంట్ ?
కురుక్షేత్ర యుద్ధాన్ని మనం నివారించగలిగే ఉండేవాళ్లమని నీవు భావిస్తున్నావా?
ప్రభుత్వం ఐఐటీలకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. అయినా వాళ్లు విదేశాలకు వెళ్లిపోతున్నారు. మేధోవలసను అరికట్టడమెలా?
ఇన్ఫ్ల్లేషన్ అంటే ఏమిటి?
నీకు ఇష్టమైన తత్వవేత్త ఎవరు?
మెయిన్స్ రాత పరీక్షలు అక్టోబరు, లేదా నవంబరులో నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. రెండో దశ మెయిన్స్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లే, మెయిన్స్ రాసేందుకు అర్హులు.
ప్రిలిమ్స్ : ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ రెండొందల మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ మల్టిఫుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్ కాల వ్యవధి రెండు గంటలు.ఒక పేపర్ పూర్తిగా జనరల్ స్టడీస్, మరొక పేపర్లో కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్లపై ప్రశ్నలుంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ల్లో ఉంటుంది. ఈ మార్కులు కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఫైనల్ ర్యాంకింగ్లో ఈ మార్కులను కలపరు.
మెయిన్స్: మెయిన్స్లో మొత్తం తొమ్మిది పేపర్లుంటాయి. పేపర్-1లో అభ్యర్థి ఎంచుకున్న ఏదైనా భారతీయ భాష 300 మార్కులకు ఉంటుంది. ఇది కూడా ఫైనల్ మార్కుల్లో కలపరు. పేపర్-2లో ఇంగ్లిష్ ఉంటుంది. దీనికి కూడా 300 మార్కులు ఉంటాయి. ఈ రెండు పేపర్ల్లో వచ్చిన మార్కులను చివరి మార్కుల్లో కలపరు. కానీ కనీస మార్కులు సాధిస్తేనే మిగతా పేపర్లు దిద్దుతారు. పేపర్-3లో జనరల్ ఎస్సే ఉంటుంది. దీనికి రెండొందల మార్కులు. పేపర్ 4, 5 జనరల్ స్టడీస్ ఉంటాయి. ఒక్కో పేపర్కు మూడొందల మార్కులు, పేపర్-6, 7, 8, 9 అభ్యర్థి ఎంచుకున్న ఏవైనా రెండు ఆప్షనల్ సబ్జెక్టుల నుంచి ఒక్కో పేపర్ 300 మార్కులకు ఉంటుంది.
ఇంటర్వ్యూ: మెయిన్స్ ఉత్తీర్ణులైనవారిని ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ 300 మార్కులకు ఉంటుంది.
‘‘నాకొక లక్షణం ఉంది. ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు కచ్చితంగా మెలకువ వస్తుంది. నాకు నా మనోగడియారం ఉంది. అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. సహజంగా లేవాలనుకునే సమయానికి కొద్ది నిమిషాలు ముందే మెలకువ వస్తుంది’’
ఇందులో జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు, భారత దేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య సంఘటనలు; భారత్, ప్రపంచ భూగోళం(నైసర్ఘిక, సాంఘిక, ఆర్థిక); భారత రాజనీతి, ప్రభుత్వం, రాజ్యాంగం, రాజకీయ విధానం, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్, ఆర్థిక సాంఘికాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్...పర్యావరణం, బయోడైవర్సిటీ, వాతావరణ మార్పులు (ఈ అంశాల్లో ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు) జనరల్ సైన్స్ అంశాల్లో అభ్యర్థి పరిజ్ఞానం పరిశీలిస్తారు.
జాగ్రఫీ: ఫ్యాక్ట్స్, కాన్సెప్ట్స్ క్షుణ్నంగా చదవాలి. పాత ప్రశ్నపత్రాల ఆదారంగా మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేయాలి. జనాభా, సెన్సస్, వనరులు, వాతావరణం...సంబంధిత సంస్థలపై పూర్తి సమాచారం తెలుసుకోవాలి.
పాలిటీ: రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూళ్లు, సవరణలు, రాజ్యాంగ సంస్థలు, నియామకాలు-అర్హతలు, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ముఖ్యాంశాలపై అవగాహన అవసరం. దేశ రాజకీయ- పాలనా వ్యవస్థకు సంబంధించి రాజ్యాంగ, న్యాయ, పాలనాపరమైన పరిణా మాలను ప్రశ్నలుగా అడగొచ్చు. జ్యుడీషియల్ యాక్టివిజమ్, రాష్ట్రాల అటానమీ డిమాండ్స్, ప్రాథమిక విధులు వంటి అంశాల నుంచి గతంలో ప్రశ్నలొచ్చాయి.
ఎకానమీ: బడ్జెట్, బడ్జెట్ అంశాలు, సూచీలు, ఫ్రభుత్వ పథకాలు, ఆహారోత్పత్తుల గణాంకాలు, పారిశ్రామికోత్పత్తి, విదేశీమారకం, చెల్లింపుల శేషం, పంచవర్ష ప్రణాళికలు, విదేశీ వాణిజ్యం, విదేశీ పెట్టుబడులు ...అంశాలు బాగా చదువుకోవాలి. తాజా వ్యవహారాల నుంచి ఈ విభాగంలో ప్రశ్నలు రావొచ్చు.
హిస్టరీ: పురాతన, ఆధునిక, మధ్యయుగ చరిత్ర చదవాలి. భారత చరిత్ర కాలగమనం, యుద్ధాలు-సంవత్సరాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి, కవులు-వారి సాహిత్య సేవలు, రాజుల ప్రోత్సాహకాలు...ఇవన్నీ చదవాలి.
కరెంట్ ఈవెంట్స్: ముఖ్యమైన సదస్సులు-వేదికలు, అవార్డులు, ముఖ్యమైన సంక్షోభాలు, భారత్-విదేశీ సంబంధాలు, ప్రముఖుల భారత్ పర్యటనలు, ప్రధాని విదేశీ పర్యటనలు, విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, ముఖ్యమైన ఆటల పోటీలు-విజేతలు, పరాజితులు, ప్రపంచ రికార్డులు, నోబెల్ ప్రైజులు, సాహిత్య అవార్డులు, ప్రముఖులు రాసిన పుస్తకాలు... ఇవన్నీ చదువుకోవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లోని ప్రాథమికాంశాలు, కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ సంబంధ అంశాలు, సైన్స్కు సంబంధించిన వివిధ సంస్థలు-సదస్సులు, కొత్త టెక్నాలజీలు...ఇవన్నీ తెలుసుకోవాలి.
ఎకాలజీ: పర్యావరణం, ఓజోన్ పొర, ప్రస్తుత పర్యావరణ సదస్సులు, వివిధ పర్యావరణ సంస్థలు, పర్యావరణ సమతౌల్యం...ఇలాంటి అంశాల్లో తేలికపాటి ప్రశ్నలే వస్తాయి.
సూచనలు:
- నెగటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి లాటరీ వద్దు.
- సిలబస్ ప్రకారం అన్నీ చదవడం పూరె్తైన తర్వాత ప్రాక్టీస్ పరీక్షలు రాయాలి.
- సివిల్స్ కోసం కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించినవాళ్లు ఇప్పటికిప్పుడు మెయిన్స్ కోసం చదవలేరు కాబట్టి పూర్తి దృష్టంతా ప్రిలిమ్స్పైనే కేంద్రీకరించాలి.
- ఒక అంశం చదవడం పూరె్తైన వెంటనే దానిలోని ముఖ్యాంశాలతో సంక్షిప్త నోట్స్ రూపొందించుకుంటే రివిజన్కు బాగా ఉపయోగపడుతుంది.
- సమకాలీన అంశాలపై దిన పత్రికల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన సాధించాలి.
- రోజుకు 7 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. ఒక గంట యోగా లేదా వ్యాయామం చేస్తే మెదడు చురుకుగా పనిచేస్తుంది.
- గత పదేళ్ల ప్రిలిమ్స్ పేపర్-1 ప్రశ్నపత్రాలు బాగా చదవాలి. వీటిద్వారా ఏ అంశాల్లో ఎలాంటి ప్రశ్నలొస్తున్నాయి? సబ్జెక్టుల వారీ దేనికెంత ప్రాధాన్యం...లాంటి విషయాలు తెలుస్తాయి. ఇలా చేయడం వల్ల ప్రిపరేషన్ సులువవుతుంది.
తెలుగు మాధ్యమంలో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఇంటర్వ్యూను తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లోను చేయవచ్చు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ చరిత్ర, నిజాయతీ.. ఈ మూడూ ప్రాధాన్యం ఉన్న అంశాలే. ఇంటర్వ్యూకు మొదటిసారి హాజరవుతున్నవాళ్లు చేసే చిన్నచిన్న తప్పులకు సడలింపు ఉంటుంది. ఇప్పటికే సర్వీస్లో ఉన్నవాళ్లు, ఐఐటీ, ఐఐఎం నుంచి వచ్చినవాళ్లపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఈ బోర్డైతే బాగుంటుంది లాంటి అపోహలు లేకుండా నమ్మకంతో ముందుకు సాగండి. తెలుగులో సమాధానాలు చెప్పేవారికి ఇంగ్లిష్లో అనువదించడానికి దుబాషీలను ఏర్పాటుచేస్తారు.
ప్రాంతం: మీ ప్రాంతానికి సంబంధించిన సమాచారం అంటే భౌగోళిక స్వరూపం, చరిత్ర, ఎకానమీ... లాంటి అంశాలపై అవగాహన ఉండాలి. ప్రసిద్ధ కట్టడాలు, ఉద్యమాలు, నదులు, ప్రాంతీయ సమస్యలు తదితర అంశాలు తెలుసుకోవాలి.
ఇంటిపేరు: మీ ఇంటిపేరుతో ఉన్న ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సమాచారంతోపాటు.. మీ ఆర్థిక, సామాజిక నేపథ్యం, తల్లిదండ్రుల వృత్తి వంటి వాటిపై అవగాహన ఉండాలి.
హాబీస్: ఉదాహరణకు సినిమాలను హాబీగా రాసిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని ఎన్టీఆర్, చిరంజీవి గురించి పోల్చి చెప్పమనడం, సినిమా వ్యక్తుల రాజకీయ ప్రవేశం గురించి మీ ఉద్దేశాన్ని తెలుసుకోవడం, ఆంధ్రలో సినిమా హీరోలను ఎందుకు ఆరాధిస్తారో చెప్పమనడమో, సినిమాల ప్రభావం రాజకీయూలపై ఏమేరకు ఉంటుంది అని ప్రశ్నిం శవచ్చు.
అకడమిక్ బ్యాక్గ్రౌండ్: డిగ్రీ స్థాయిలో చదివిన కోర్సుల్లో వస్తున్న మార్పులు... సివిల్స్ను ఎంచుకోవడానికి కారణం, ఆప్షనల్స్ ఎంచుకో వడానికి కారణాలు.
సర్వీస్ ఆప్షన్స్: మీరు ఏ సర్వీసును ఎంచుకున్నారు.. దానికి కారణాలు... ఎంచుకున్న సర్వీసుకు సంబంధించిన సమాచారం తెలిసుం డాలి.
సెల్ఫ్చెక్: ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు.. దానికి మీరు చెప్పే సమాధానం.. మీ ఆన్సర్పై బోర్డు అడిగే అనుబంధ ప్రశ్నలను ఊహించుకొని ప్రిపేరైతే జవాబుల్లో స్పష్టత ఉంటుంది.
కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలు మీ విశ్లేషణా సామ ర్థ్యాన్ని పరిశీలించే విధంగా ఉంటాయి. రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో జనజీవనంతో ముడిపడిన అంశాలతోపాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ సమస్య, ఎస్సీల వర్గీకరణ, సత్యం కుంభకోణం, రాష్ట్రంలో అమలులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఫీ రీఎంబర్స్మెంట్, రాష్ట్ర బడ్జెట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104... ఇలా దేని గురించైనా అడగొచ్చు. ఎన్నికల హామీలు.. రాష్ట్ర రాజకీయూలు.. వివిధ జాతీయ రాజకీయ పార్టీలు-పొత్తులు, ఉగ్రవాదం, ఆర్థిక మాంద్యం, కార్పొరేట్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ... తదితర అంశాలపై ప్రశ్నించొచ్చు.
ట్రెండ్ మారుతోంది...
ఇటీవలి కాలంలో యుపీఎస్సీ ఇంటర్వ్యూ విధానంలో మార్పులు వచ్చాయి. ఆ ప్రశ్నల సరళి ఇలా ఉంటోంది.. మీ జీవిత లక్ష్యాలు బలాలు, బలహీనతలు, సర్వీసుకు ఎంపికైతే ఎలాంటి పనులు చేస్తారు? కెరీర్ అంటే కేవలం డబ్బేనా? కెరీర్కు మీరిచ్చే నిర్వచనం.. పదేళ్ల తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలడుగుతున్నారు.
కొంతమంది కనీసం మూడుసార్లు పరీక్షరాస్తే గానీ ఇంటర్వ్యూ వరకు రాలేరు. మూడేళ్లు చదివితే గానీ ఇంటర్వ్యూ వరకు రాలేకపో యూవా? అని ప్రశ్నిస్తారు. ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని తక్కువచేసి చూడటానికి కాదు. మీలో సహనం ఎలా ఉంది? ఓపికెంత? ఒత్తిడిని తట్టుకోగలరా? ఇవన్నీ పరిశీలించడానికే.
మీరూ అడగొచ్చు...
ఒక్కోసారి ఇంటర్వ్యూ ఆఖరులో ఏదైనా ప్రశ్న అడగమని బోర్డు కోరుతుంది. మీరడిగే ప్రశ్న బోర్డు సభ్యుల అపార అనుభవం నుంచి మీరు నేర్చుకోవడానికి తోడ్పడేలా ఉండాలి. దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వెంట్లను ఎంపిక చేసే బోర్డులో సభ్యులు కావడం పట్ల మీరు ఎలా ఫీలవుతున్నారు? లాంటి ప్రశ్నలు అడగొచ్చు. అంతేకానీ మీ తెలివితేటలను ప్రదర్శించుకునేలా ప్రశ్నలు ఉండకూడదు.
డ్రెస్సింగ్..
అబ్బాయిలైతే ముదురు రంగు ప్యాంటు, లేతరంగు షర్టు వేసుకుంటే మంచిది. పాలిష్ చేసిన నలుపు లేదా బ్రౌన్ రంగు బూట్లు ధరించొచ్చు. అమ్మాయిలైతే చీరలే మంచిది. సెంట్లు వాడకపోవడమే శ్రేయస్కరం. డ్రెస్సింగ్ కోసం ఎక్కువ సమయూన్ని వృథా చేయొద్దు. 1973 ఇంటర్వ్యూలో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వేసు కున్న తెల్లరంగు చొక్కాపై సుమారు 20 నిమిషాలు ఇంటర్వ్యూ సాగింది.
మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి:
మీలోని లోపాలను విశ్లేషించి సలహా ఇచ్చే వారి దగ్గరికే మాక్ ఇం టర్వ్యూలకు వెళ్లాలి. నిపుణులు, సీనియర్లు ఇచ్చిన సలహా పాటిం చాలి. వార్తాపత్రికలు, టీవీల్లోని విశ్లేషణల్లో అంశాలను విశ్లేషిం చుకుంటూ... ప్రతి అంశంపై మీకంటూ ఒక సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి. బాడీలాంగ్వేజ్, భాషపై మరీ ప్రత్యేకమైన శ్రద్ధ అవ సరం లేదు. ఒరిజినాలిటీ ముఖ్యం.
Describe అనే పదం అర్థం పరిశీలిస్తే.. తెలుగులో ‘వర్ణించటం’ దానికి సమానార్థకం. ఏదైనా విషయాన్ని వర్ణించమన్నప్పుడు చిన్న ప్పుడు బామ్మలు, తాతయ్యలు కథలను ఎలా వర్ణించి చెప్పేవారో? ఒక్కసారి మనం స్ఫురణకు తెచ్చుకోవాలి. ఈ వర్ణనలో పాటించాల్సిన క్రమాన్ని కూడా సమాధానం రాసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒక మనిషిని గురించి వర్ణించేటప్పుడు.. శిరస్సుతో ప్రారంభమై, పాదాలతో ముగుస్తుంది. అంటే.. ప్రాముఖ్యతా క్రమాన్ని తప్పకుండా వర్ణిస్తేనే.. వర్ణన రక్తికడుతుంది.
Analyse అంటే.. విశ్లేషించటం. విశ్లేషణలో ఆ విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై లోతైన పరిశీలన అవసరం. అలాగే critically Analyse అంటే... విమర్శనాత్మక దృక్పథంతో లోతైన అధ్యయనం కలిగిన సమాధానం రాయమని అర్థం. Analyse, critically Analyse కు తేడా ఏంటంటే... Analyse అన్నప్పుడు అభ్యర్థి తటస్థ విశ్లేషకుడిగా సమాధానం రాస్తే..critically Analyse అన్నప్పుడు విమర్శనాత్మక దృక్పథంతో కూడిన విశ్లేషణ రాయాల్సి ఉంటుంది.
Enumerate అంటే.. విషయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను యధాతథంగా చెప్పటం. అలాగే Explain అంటే.. ముఖ్యాంశాలను యధాతథంగా చెప్పటమే కాక, వాటిని స్పష్టంగా వివరించటం అవసరం. అలాగే comment అన్నప్పుడు, విషయా నికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను చెబుతూనే.. అభ్యర్థి తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అంటే.. ముఖ్య మైన అంశాలపై అభ్యర్థి వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే... Describe అన్నప్పుడు కవి లాగా.. Analyse అన్నప్పుడు విషయాన్ని విశ్లేషించే అధ్యాపకుడిలా గానూ.. critically Analyse అన్నప్పుడు విమర్శనాత్మక పాత్రికే యుడిగా.. Enumerate అన్నప్పుడు వార్తల్లో ముఖ్యాంశాలు చదివే News Reader లాగాను.. Explain అన్నప్పుడు వివరాలతో సహా వార్తలను అందించే విలేఖరిలాగాను.. Discuss అన్నప్పుడు ఏదైనా ఒక విషయంపై జరిగే చర్చలో సంచాలకుడిగాను... Comment అన్నప్పుడు విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, దానికి సంబంధించిన అన్ని అంశాలపై వ్యాఖ్యానించే వ్యాఖ్యాతగాను (ఉదాహరణ: టీవీల్లో చూసే ప్రత్యక్ష వ్యాఖ్యానాలు-విషయంపై వ్యాఖ్యాత అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంటాయి) అభ్యర్థి వ్యవహరించాలి. News Reader కవిలా మారినా.. సంచాలకుడు వ్యాఖ్యాతగా మారినా.. పాత్రికేయుడు అధ్యాపకుడిగా మారినా... రక్తి కట్టకపోగా రసాభాసగా మారుతుంది.
ముఖ్యాంశాలు
పద పరిమితి(వర్డ్ లిమిట్) అనేది మీ సౌకర్యం కోసమే; కాబట్టి సమయపాలన మీ చేతిలోనే ఉంది. భాష... చిన్నచిన్న పదాలు, వాక్యాలతో అర్థ్ధవంతంగా, సరళంగా ఉండాలి. పెద్దపెద్ద పదబంధాలతో సంక్లిష్టంగా ఉంటే... అభ్యర్థికి నష్టం వాటిల్లడం ఖాయం. అర్థం కాకుండా ఎంత రాసినా వ్యర్థమే.
చేతిరాత అందంగా చదివించేట్లుగా ఉండటం మేలు చేస్తుంది. రెండు మార్కుల ప్రశ్నలను మొదట పూర్తి చేయండి. ఆలోచిస్తూ సమయం వృధా చేయకుండా... బాగా తెలిసిన ప్రశ్నలకు మొదట సమాధానాలు రాయడం మేలు. బ్యాలెన్స్డ్ అభిప్రాయూలతో సమాధానాన్ని ప్రారంభిస్తే... సగం పని పూర్తయినట్లే. సాంఘిక, రాజకీయ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రాసేటప్పుడు రాజ్యాంగ విలువలను తప్పనిసరిగా అనుసరించాలి. మీరు చెప్పదలచుకున్న పాయింట్స్ను సరిగా ప్రజెంట్ చేయండి. ముఖ్యమైన అంశాలకు సమాధానంలో ప్రాధాన్యం ఇవ్వండి.
మెయిన్స్ పరీక్షకు సంబంధించిన గతంలో వచ్చిన ప్రశ్నలు చాప్టర్ల వారీగా మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని దగ్గర పెట్టుకోండి. ప్రిపరేషన్ విషయంలో అనవసరమైన సలహాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే... మీకు మీరే సరైన నిర్ణేత. కఠిన నిబంధనలకు యూపీఎస్సీ ప్రాముఖ్యత ఇవ్వదు. ఇలాంటి వాటిని ప్రొఫెసర్లు కూడా పట్టించుకోరు. నిర్మాణాత్మకమైన, సమయోచితమైన ఆలోచనా విధానం సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థికి మంచి ఫలితాల్ని ఇస్తుంది. కొన్ని కోచింగ్ సెంటర్ల వాళ్లు అభ్యర్థులు తమపై ఆధారపడేట్లు చేస్తూ... ప్రిపరేషన్ ప్రక్రియను సంక్లిష్టం చేస్తున్నారు.
ఆప్షనల్ సబ్జెక్టుల్లో వివిధ అంశాలపై ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంపిక చేసుకున్న కొన్ని మంచి పుస్తకాల్లోని ముఖ్య కాన్సెప్ట్లను ఒకటికి 10 సార్లు చదివితే ఆ విషయంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. దొరికిన ప్రతి పుస్తకం చదవడం వల్ల సమయం వృథా కావడంతో పాటు స్పష్టత కొరవడుతుంది. రోజూ ప్రిపరేషన్కు కేటాయించే సమయంలో 60% ఆప్షనల్ సబ్జెక్టుకు, 40% జనరల్ స్టడీస్కు కేటా యిస్తే ప్రిపరేషన్లో సమతుల్యత ఏర్పడి ఫలితం ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ లేదా సిలబస్లో ప్రతి అధ్యాయాన్ని చదివిన తర్వాత ఆ అధ్యాయం నుంచి గత ప్రశ్నాపత్రాల్లో వచ్చిన ప్రశ్నలను సాధన చేయాలి. మళ్లీ ఆ అధ్యాయాన్ని తిరిగి చదివేటప్పుడు ఆ ప్రశ్నల దృష్టి కోణంలో చదివితే పాత వాక్యాల్లోనే కొత్త అర్థాలు స్ఫురించటం, మొదట్లో పరిశీలించని అంశాలెన్నో మన దృష్టికి వస్తాయి. ఇలా పఠ నం, మననం ఏక కాలంలో సాగితే అడిగిన ప్రశ్నకు వేగంగా స్పందిం చి సమాధానం రాయగలిగే నైపుణ్యం పెరుగుతుంది. ఆప్షనల్ సబ్జెక్టు సిలబస్ పూర్తి అయిన తర్వాత మోడల్ ప్రశ్నాపత్రాలను వీలైనన్ని ఆన్సర్ చేయాలి. దీంతో ఎక్కడ తప్పులు చేస్తున్నామో తెలియడమే కాకుండా నిర్దేశిత సమయంలో మనం ప్రశ్నపత్రాన్ని పూర్తి చేస్తు న్నామో లేదో తెలుస్తుంది. ఆప్షనల్ సబ్జెక్టు, జనరల్ స్టడీస్కు సంబం ధించి మోడల్ పరీక్షలు రాసే సమయాన్ని యూపీఎస్సీ నిర్ధారిత సమయంలో రాయటం అలవాటు చేసుకుంటే అది ఒక నిరంతర ప్రక్రియగా మారి అసలు పరీక్ష రోజున శరీరం, మనసు, మెదడు శిక్షణ పొందిన సైనికుల్లా పని చేయడానికి అలవాటు పడతాయి.
జనరల్ స్టడీస్ జనరల్గా....
ఈ విభాగంలో మంచి మార్కులు పొందాలంటే సూచించిన పుస్తకా లను క్షుణ్ణంగా కనీసం 4సార్లు చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. మనం చదవగలిగే సమాచారం ఎంత? గంటకు మనం చదివే వేగం ఎంత?(కనీసస్థాయి 12-15 పేజీలు) లభించిన సమయంలో విషయాన్ని 4సార్లు రివిజన్ చేయటానికి మన విషయసేకరణ కూర్పు, ఎంత పకడ్బందీగా ఉండాలి? లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన అభ్యర్థికి అవసరం. ప్రణాళిక అంత సూక్ష్మస్థాయిలో సరిగ్గా అమలు చేయగలిగితేనే స్థూలస్థాయిలో ఆశించిన ఫలితం వస్తుంది.
ఎంచుకున్న సబ్జెక్టులో ఆప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఎబిలిటీ అవసరం. ఏ ప్రశ్న అడిగినా రాయగలిగే సమర్థత, సన్నద్ధత రావాలంటే ఎంచుకున్న సబ్జెక్టును ప్రేమించాలి. సబ్జెక్టును ప్రేమించాలంటే ఆసక్తి ఉన్న దాన్నే ఎంచుకోవాలి. మీరు డిగ్రీ చదివేటప్పుడే ఏ ఆప్షనల్ ఎంచుకోవాలో ఒక నిర్ణయూనికి రండి. డిగ్రీ స్థారుులో చదివిన సబ్జెక్టులను కూడా ఆప్షనల్స్గా ఎంచుకోవచ్చు. అరుుతే ఈ సబ్జెక్టుల్లో మీ ప్రిపరేషన్ చాలా లోతుగా ఉండాలి.
ప్రస్తుత విధానం ప్రకారం మెయిన్స్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇందులో నాలుగు జనరల్ స్టడీస్ (4 x 250=1000), రెండు ఆఫ్షనల్ (2 x 250=500), జనరల్ ఎస్సే, ఇంగ్లిష్తో కూడిన ఒక పేపర్ (300 మార్కులు) ఉంటాయి. మెయిన్స్ మొత్తం 7 పేపర్లకూ కలిపి 1800 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది.
సిలబస్ కోసం చూడండి
జనరల్ 1200
ఓబీసీ 1175
ఎస్సీ 1150
ఎస్టీ 1120
(ఇది కేవలం అంచనా కోసమే. ఆ సంవత్సరం అభ్యర్థులు గరిష్టంగా పొందిన మార్కులు, ఉన్న ఖాళీల బట్టి ఈ కటాఫ్ మారుతుంది)
కేటగిరీ మార్కులు
జనరల్ 980
ఓబీసీ 960
ఎస్సీ 950
ఎస్టీ 920
Work is love made visible
అనే ఖలీల్ జీబ్రాన్ మాటలను ప్రిపరేషన్ కోసం సిద్ధపడ్డ ప్రతి ఒక్కరూ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
ఆ ఏడాది ఉన్న మొత్తం ఖాళీలకు రెండు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఇంటర్వ్యూ ముఖ్యోద్దేశం మీరు పబ్లిక్ సర్వెంట్గా సేవలందించడానికి సరిపోతారా లేదా అనేదాన్ని బోర్డు సభ్యులు పరిశీలించడానికే. మీ మనోసామర్థ్యం, మానసిక పరిణతిని గమనిస్తారు తప్ప ఇదేమీ కఠినమైన క్రాస్ ఎగ్జామినేషన్ కాదు. కేవలం ఇంటలెక్చువల్ క్వాలిటీస్ (పరిజ్ఞాన లక్షణాలు/మేధోపరమైన లక్షణాలు) కాకుండా.. సోషల్ ట్రైట్స్, వర్తమాన విశేషాలపై మీకున్న ఆసక్తిని గమనిస్తారు. మీ అభిరుచులపై ప్రశ్నలడుగుతారు.
ఇవి గమనిస్తారు...
మెంటల్ అలర్ట్నెస్, క్రిటికల్ పవర్స్ ఆఫ్ అసిమిలేషన్, క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్పోజిషన్, బ్యాలెన్స్ ఆఫ్ జడ్జిమెంట్, వెరైటీ అండ్ డెప్త్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎబిలిటీ ఫర్ సోషల్ కొహెషన్, లీడర్షిప్, ఇంటలెక్చువల్ అండ్ మోరల్ ఇంటిగ్రిటీ.
మీకున్న జనరల్ నాలెడ్జ్, అకడమిక్ పరిజ్ఞానం, ఆప్షనల్ సబ్జెక్టులపై ప్రశ్నలేయరు. ఎందుకంటే.. వీటిని ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లోనే పరిశీలించారు. మీ చుట్టూ, బయట, రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న వివిధ సంఘటనలు, కొత్త ఆవిష్కరణలపై ప్రశ్నలు అడుగుతారు. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తెలుగులోనూ సమాధానం చెప్పొచ్చు. దీనికోసం ట్రాన్స్లేటర్ను ఏర్పాటు చేస్తారు. అయితే ఇంగ్లిష్లోనే సమాధానం చెప్పడం శ్రేయస్కరం.
పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
కామర్స్-మేనేజ్మెంట్
ఆంత్రోపాలజీ-సోషియాలజీ
మ్యాథ్స్-స్టాటిస్టిక్స్
అగ్రికల్చర్-యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సెన్సైస్
మేనేజ్మెంట్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
సివిల్- మెకానికల్- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (మూడింట్లో ఒకదాన్నే తీసుకోవాలి)
యానిమల్ హజ్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్-మెడికల్ సైన్స్
(పైనున్న ఏ జోడీ కాంబినేషన్లలోనైనా జోడీకి ఒకదాన్నే ఎంచుకోవాలి) ఏ రెండు భాషా సాహిత్యాలనూ కలిపి ఆప్షనల్స్గా ఎంచుకునే వీలు లేదు.
మార్కెట్లో దొరికిన ప్రతి పుస్తకాన్నీ సేకరించవద్దు. సివిల్స్లో విజయం సాధించిన సీనియర్లు, కోచింగ్ ఫ్యాకల్టీతో చర్చించి ఏయే పుస్తకాలు చదవాలో ఒక నిర్ణయానికి రండి. ప్రిపరేషన్ సమయంలో వాటిని మాత్రమే మీ రూంలో ఉంచుకోవాలి. పదులసంఖ్యలో న్యూస్పేపర్లు... మ్యాగజీన్లు కొన్నంత మాత్రాన సక్సెస్ రాదు. ఎన్ని పుస్తకాలు కొన్నాం అనేదానికంటే... ఎంత చదివాం.. ఎన్ని అంశాలు గుర్తుంచుకున్నాం... ఎంత బాగా రాశాం అన్నదే ప్రధానం. మీరు అంతిమంగా పరీక్ష హాలులో 3 గంటల్లోపు ఏం రాశారు అనేదే కీలకం. ఏ పుస్తకం చదవాలి.. ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి... ఆప్షనల్స్గా వేటిని ఎంపిక చేసుకోవాలి?ఉద్యోగం చేయాలా? లేక మానేసి ప్రిపేర్ కావాలా అని ఆలోచిస్తూ ... ఏమీ చేయకుండా సమయం వృథా చేసుకోవద్దు. ఏ నిర్ణయమైనా ఒక నిర్ణీత వ్యవధిలోపు బాగా ఆలోచించి తీసుకోండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గద్దు.
www.sakshieducation.com
https://upsc.nic.in,
లాంటి వెబ్సైట్లలో వెతుక్కోవచ్చు.
పేపర్-1
ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ: 11, 12 తరగతుల ఎన్సీఈఆర్టీ పుస్తకాలు
పాలిటీ: యాన్ ఇంటర్డక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అవర్ కాన్స్టిట్యూషన్
జనరల్ సైన్స్: ఎన్సీఈ ఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు
సైన్స్ అండ్ టెక్నాలజీ: మనోరమ, ఇండియా ఇయర్ బుక్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు
కరెంట్ అఫైర్స్: ప్రతి రోజూ దినపత్రిక చదువుతూ ముఖ్యాంశాలు రాసుకోవాలి. మనోరమ ఇయర్ బుక్లో కరెంట్ అఫైర్స్ సెక్షన్ చదువుకుంటే చాలు
పేపర్-2
ఇంగ్లిష్: ఎ ప్రాక్టికల్ ఇంగ్లిష్ గ్రామర్-థాంప్సన్ మార్టినెట్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ-నార్మన్ లూయీస్
మ్యాథ్స్: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-ఆర్ఎస్ అగర్వాలా
బ్యాంక్ పీవో నమూనా పరీక్షలు రాస్తే సివిల్స్ పేపర్-2పై అవగాహన వస్తుంది.