Skip to main content

Agni Swasa: సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగు సాహితీవేత్త?

Nikhileswar

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విప్లవకవి నిఖిలేశ్వర్‌(కుంభం యాదవరెడ్డి) 2020 సంవత్సరానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన తెలుగులో రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటి (2015–2017)కి ఈ పురస్కారం లభించింది. సెప్టెంబర్‌ 18న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నిఖిలేశ్వర్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివి«ధ భాషల్లోని 22 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డు పొందినవారికి లక్ష రూపాయల ప్రైజ్‌ మనీతోపాటు జ్ఞాపికను అందించారు. ప్రముఖ హిందీ రచయిత విశ్వనాథ్‌ ప్రసాద్‌ తివారీ ముఖ్యఅతిథిగా హాజరుకాగా, సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ కంబర అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.

బాహుబలి అహింస దిగ్విజయం

కన్నడభాషలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ రచించిన ‘శ్రీ బాహుబలి అహింస దిగ్విజయం’పుస్తకానికిగాను ఆయన  సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఏ ట్రావెలర్‌’అనే ఆంగ్ల రచనకుగాను ప్రముఖ రచయిత్రి అరుంధతి సుబ్రమణ్యం అకాడమీ అవార్డు అందుకున్నారు.

చ‌ద‌వండి: బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైన ర‌చ‌యిత్రి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సాహిత్య అకాడమీ అవార్డు–2020 అందుకున్న తెలుగు సాహితీవేత్త?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 18
ఎవరు    : ప్రముఖ తెలుగు సాహితీవేత్త, విప్లవకవి నిఖిలేశ్వర్‌(కుంభం యాదవరెడ్డి)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు  : అగ్నిశ్వాస కవితా సంపుటిని రచించినందుకు...

 

Published date : 20 Sep 2021 06:14PM

Photo Stories