Skip to main content

డిజిటల్ విద్యతో నైపుణ్యాలు అసాధ్యమే: ఎన్‌సీఈఆర్‌టీ

సాక్షి, అమరావతి: కరోనాతో మూతపడ్డ పాఠశాలలు సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇంటర్మీడియెట్ కాలేజీలు ఆరంభమైనా లెక్చరర్లు మాత్రమే వస్తున్నారు. డిగ్రీ, ఇతర ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా తెరుచుకోలేదు. విద్యా సంస్థలు మొదలవ్వడం ఆలస్యమైతే ఆన్‌లైన్ బోధన తప్పనిసరవుతుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతు న్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ బోధన సాగుతోంది. అయితే ఇది ఏ మేరకు విద్యార్థులకు సామర్థ్యాలను, నైపుణ్యాలను అందించగలదన్న ప్రశ్న నిపుణుల నుంచి వినిపిస్తోంది.

అందరికీ అందుబాటులో లేని ఆన్‌లైన్ పాఠాలు

  • పభుత్వ విద్యా సంస్థల్లో సగానికిపైగా విద్యార్థులకు కంప్యూటర్లు, ట్యాబ్, టీవీలు అందుబాటులో లేవు. దీంతో వారికి ఆన్‌లైన్ పాఠ్యాంశాలు సమాన రీతిలో అందడం లేదు.
  • రాష్ట్రంలో మొత్తం 62,305 పాఠశాలలుండగా అందులో ప్రభుత్వ స్కూళ్లు 45,149, ప్రైవేటు స్కూళ్లు 17,156 ఉన్నాయి. వీటిలో 72,31,253 మంది చదువుతున్నారు.


సామర్థ్యాల పెంపు అంతంతే..

  • ఆన్‌లైన్ బోధన వల్ల పూర్తిస్థాయి నైపుణ్యాలు అందవని నిపుణులు పేర్కొంటున్నారు.
  • పాఠశాలల స్థాయిలో ఆన్‌లైన్ బోధన వల్ల ప్రయోజనం లేకపోగా పిల్లలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నాయని ఇటీవల యునిసెఫ్ తేల్చిచెప్పింది.
  • ఈ నేపథ్యంలో ఇటీవల జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆన్‌లైన్ బోధనకు సమయ పరిమితులను విధించింది. 1-8 తరగతులకు రోజుకు రెండు క్లాసులు, 12వ తరగతి వరకు 4 క్లాసులుండాలని వెల్లడించింది.


కంటెంట్ సమస్యలు

  • ఆన్‌లైన్ పాఠాలు రొటీన్‌గా కాకుండా వారితో ప్రయోగాలు చేయించే పద్ధతిలో ఉండాలని నిపుణులు అంటున్నారు.
  • డిజిటల్ పరికరాలు, నెట్ సదుపాయం లేని గ్రామాల్లో ప్రత్యేక టీవీ లేదా స్క్రీన్ ఉపయోగించి వీడియో పాఠాలు చెప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • కంటెంట్ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వమే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక చానెల్ నిర్వహించాలని, ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లు అందించాలని చెబుతున్నారు.


జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, విద్యార్థుల వివరాలు..

జిల్లా

ప్రభుత్వ

ప్రైవేటు

మొత్తం విద్యార్థులు

స్కూళ్లు

శ్రీకాకుళం

3,880

1,253

5,133

3,76,399

విజయనగరం

4,883

1,379

6,262

3,08,571

విశాఖపట్నం

4,309

1,775

6,084

6,90,970

తూర్పు గోదావరి

3,340

1,594

4,934

7,41,981

పశ్చిమ గోదావరి

3,279

1,336

4,615

5,42,415

కృష్ణా

2,738

1,890

4,628

6,25,734

గుంటూరు

2,887

1,561

4,448

7,01,100

ప్రకాశం

3,393

1,158

4,551

4,91,361

నెల్లూరు

3,277

1,199

4,476

4,04,496

వైఎస్సార్

3,289

600

3,889

4,51,298

కర్నూలు

4,049

1,402

5,451

7,06,445

అనంతపురం

2,766

645

3,411

6,10,635

చిత్తూరు

3,059

1,364

4,423

5,79,848

మొత్తం

45,149

17,156

62,305

72,31,253



వర్చువల్ పాఠ్యాంశాలపై కసరత్తు
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు బోధన సాగాలంటే ఈ-పాఠశాలలు, ఈ- కంటెంట్‌ను అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాల్లో తెరలు అమర్చి పాఠాలు బోధిస్తున్నాం.
- బి.ప్రతాప్‌రెడ్డి, డెరైక్టర్, ఎస్‌సీఈఆర్‌టీ

ఆశించిన సామర్థ్యాలు రాబట్టలేం
ప్రత్యక్ష బోధన ద్వారానే విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందిం చగలరు. ఆన్‌లైన్ బోధనలో విద్యార్థులు వింటున్నారో, లేదో ఉపాధ్యాయులు గ్రహించలేరు. దీంతో విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలను రాబట్టలేం.
- ఎన్.మోహన్‌దాస్, ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి
ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులతో సంబంధాలు ఉండవు. ఆన్‌లైన్ క్లాసులు చెప్పా లంటే ముందుగా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలి.
- గౌస్ భాషా, అధ్యాపకులు, కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నెల్లూరు

 

Published date : 24 Jul 2020 12:35PM

Photo Stories