Skip to main content

MBBS: ఎంబీబీఎస్‌కు తొమ్మిదేళ్లే చాన్స్‌... ఒక్క ప‌రీక్ష ఫెయిలైనా మ‌ళ్లీ ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో కూర్చోవాల్సిందే..!

ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులు ప్రవేశం పొందిన తేదీ నాటి నుంచి తొమ్మిదేళ్లలోపు ఆ కోర్సును పూర్తి చేయాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్స్‌ 2023 (జీఎంఈఆర్‌-23)ను విడుదల చేసింది.
MBBS
MBBS

దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌-యూజీ మెరిట్‌ జాబితా ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఎన్‌ఎంసీ స్పష్టంచేసింది.   

చ‌ద‌వండి: విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌... ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ఎంబీబీఎస్ సీటు

తాజా గెజిట్‌ ప్రకారం.. ఇకపై ఎంబీబీఎస్‌ విద్యార్థులు అడ్మిషన్‌ తీసుకున్న నాటి నుంచి తొమ్మిదేళ్లలో కోర్సును పూర్తిచేయాలి. ప్రస్తుతం ఎంబీబీఎస్‌లో మొదటి సంవత్సరంలో ఎవరైనా ఫెయిల్‌ అయితే.. రెండో సంవత్సరంలో కొనసాగుతూ.. సప్లిమెంటరీ రాస్తారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. సెకండియర్‌లో కూర్చోవాలంటే.. సప్లిమెంటరీలో అన్ని సబ్జెక్టులను క్లియర్‌ చేయాల్సిందే. ఒక్క సబ్జెక్టులో ఫెయిల్‌ అయినా.. మళ్లీ ఫస్టియర్‌లో కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా.. ఫస్టియర్‌ పూర్తి చేయడానికి 4 అవకాశాలే ఉంటాయి.

mbbs

రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ ద్వారా జరిగే వైద్య విద్య ప్రవేశాలను నీట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అభ్యర్థుల ఆప్షన్లను రాష్ట్రాల వైద్య మండళ్లు సీట్లను కేటాయించేవి. తాజా గెజిట్‌ ప్రకారం.. కామన్‌ కౌన్సెలింగ్‌ పేరుతో ఆ ప్రక్రియను కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తుంది. 

చ‌ద‌వండి: విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాల‌నుకుంటున్నారా... అయితే వీటి గురించి తెలుసుకుని వెళ్లండి...!

వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియను ఏటా ఆగస్టులోగా పూర్తిచేయాలని తాజా గెజిట్‌ పేర్కొంటోంది. ఆగస్టు 30 దాటితే.. అడ్మిషన్‌ ప్రక్రియకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. గడువు ముగిశాక ఎంబీబీఎస్‌లో చేరేవారిని డిశ్చార్జ్‌ చేస్తామని ఎంఎన్‌సీ హెచ్చరించింది. అలాంటి వారి విద్యార్హతను గుర్తించబోమని స్పష్టం చేసింది.

mbbs

చ‌ద‌వండి: టాప్ టెన్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే... ఇక్క‌డ సీటు వ‌స్తే సెటిలైన‌ట్లే..!

ఈ ఏడాది ఆగస్టులో వైద్యవిద్యలో ప్రవేశించిన విద్యార్థులకు.. 2027 డిసెంబరులో ప్రత్యేక పరీక్ష ఉంటుందని ఎన్‌ఎంసీ తెలిపింది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే దేశంలో వైద్యవృత్తిని ప్రాక్టిస్‌ చేసుకునే అర్హత లభిస్తుంది. అందులో వచ్చిన మార్కుల ఆధారంగానే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశముంటుంది. అంటే.. 2028 నుంచి పీజీ కోసం నీట్‌ పరీక్ష ఉండదు.

Published date : 13 Jun 2023 04:13PM

Photo Stories