Skip to main content

వెటర్నరీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు గడువు మే 22

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ గత నెలలో విడుదల చేసిన బ్యాక్‌లాగ్‌ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేయదలచిన వారు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేయాలని రిజిస్ట్రార్‌ మాధవరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా దరఖాస్తులు పంపుకొనే అవకాశం కల్పించామన్నారు. అభ్యర్థులు ఈ నెల 22లోపు తమ దరఖాస్తుకు డీడీ కాపీని జతపరచి పీడీఎఫ్‌ రూపంలో registrarsvvutpt@yahoo.in కు మెయిల్‌ చేయాలన్నారు. మెయిల్‌ ద్వారా దరఖాస్తులు పంపిన అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీలోపు హార్డ్‌ కాపీలను వర్సిటీకి చేరేలా పంపాలన్నారు.
Published date : 18 May 2021 01:48PM

Photo Stories