ఉస్మానియా యూనివర్సిటీ: ములుగు ఎమ్మెల్యే సీతక్క (అనసూయ) ఓయూ క్యాంపస్ న్యాయ కళాశాలలో ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశం పొందారు.
LLM కోర్సులో సీటు సాధించిన ప్రముఖ MLA
గతేడాది ఆర్ట్స్ కాలేజీ పొలిటికల్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేసిన సీతక్క 2022లో ఎల్ఎల్ఎంలో సీటు సాధించారు. గతంలో బీఏ, ఎల్ఎల్బీ, ఎంఏ, పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ సాధించిన సీతక్క ఎల్ఎల్ఎంలో ప్రవేశం పొందడంపై పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.