Ashwini K.P.: ఐరాస మానవహక్కుల దూతగా దళిత యువతి అశ్విని
Sakshi Education
![Ashwini K.P.](/sites/default/files/images/2022/10/21/ashwini-kp-1666338469.jpg)
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్(యుఎన్ హెచ్ఆర్సీ) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని, దళిత యువతిని నియమించింది. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న 36ఏళ్ల అశ్విని కె.పి.. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ప్రత్యేక దూతగా నియమితులయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలను నిర్వర్తిస్తూనే జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తారు.ఈ పదవిలోకి వచ్చి న తొలి ఆసియా మహిళగా, తొలి భారతీయురాలిగా, తొలి దళితురాలిగా అశ్విని చరిత్ర సృష్టించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 21 Oct 2022 01:17PM