Dinosaur Eggs: భారత్లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు
Sakshi Education
Dinosaur Eggs: అరుదైన డైనోసార్ల గుడ్లు ఏ దేశంలో బయటపడ్డాయి?
Researchers finds dinosaur eggs in india
డైనోసార్లు(రాక్షస బల్లులు).. మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో రాక్షస బల్లుల అరుదైన గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోయారు.శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా గుడ్డులోనే గుడ్డు ఉండటం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని..కాబట్టి టిటానోసారస్ డైనోసార్లకు, పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి,ప్రతికూల వాతావరణం కారణంగా డై నోసార్లు అంతరించి పోయాయని భావిస్తున్నారు.