Skip to main content

50th Anniversary Celebrations: ఇక్రిశాట్‌ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

PM Modi at ICRISAT

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు కేంద్రంగా పనిచేస్తున్న ‘మెట్టప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) ఏర్పాటై యాభై ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా.. ఫిబ్రవరి 5న సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వర్ణోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, మాట్లాడారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్లుగా భారత్‌తోపాటు ఆఫ్రికా ఖండంలోని మెట్ట ప్రాంత, చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు.. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తోందని మోదీ కొనియాడారు. ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కలిసికట్టుగా కృషిచేస్తే.. దేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కష్టమేమీ కాదన్నారు. 1972 ఏడాదిలో ఇక్రిశాట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీని డైరెక్టర్‌ జనరల్‌గా జాక్వెలిన్‌ హ్యూగ్స్‌ ఉన్నారు.

చ‌ద‌వండి: వీర వనితలపై ఏ పేరుతో సచిత్ర కథలను వెలువరించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మెట్టప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) స్వర్ణోత్సవాలు ప్రారంభం 
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు    : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ    : పటాన్‌చెరు, హైదరాబాద్‌
ఎందుకు : ఇక్రిశాట్‌ ఏర్పాటై యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Feb 2022 04:15PM

Photo Stories