WHO Latest Report: శారీరక శ్రమ లోపిస్తే రూ.25 లక్షల కోట్ల నష్టం
Sakshi Education
శారీరక శ్రమ లోపించడం వల్ల 2020–30 మధ్య ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది గుండెజబ్బులు, ఊబకాయం వంటి అసాంక్రమిక వ్యాధుల బారిన పడే ముప్పుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తన తాజా నివేదికలో వెల్లడించింది.
![WHO Latest Report](/sites/default/files/images/2022/11/04/who-1667566438.jpg)
ఫలితంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా రూ.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ఆస్కారముందని హెచ్చరించింది. ప్రజల్లో శారీరక శ్రమ పెంచేందుకు డబ్ల్యూహెచ్వో 2019లో అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. అందులో చేసిన సిఫార్సులు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించేందుకు 194 దేశాల్లో ఇటీవల సర్వే నిర్వహించి నివేదికను వెలువరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 04 Nov 2022 06:23PM