Skip to main content

Covid-19: దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్‌ కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి?

Omicron Virus

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ ‘‘ఒమిక్రాన్‌’’ భారత్‌లోకి ప్రవేశించింది. తొలిసారిగా కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు పురుషుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు డిసెంబర్‌ 2న కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. వారిద్దరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని,  వారిలో  లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. అగర్వాల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమిక్రాన్‌ సోకిన వారిలో ఒకరు దక్షిణాఫ్రికా వాసి (66) కాగా, మరొకరు బెంగళూరుకు చెందిన వ్యక్తి (46). 66 ఏళ్ల వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకి రాగా, 46 ఏళ్ల వయసున్న వైద్యుడు ఎలాంటి విదేశీ ప్రయాణం చేయలేదు. వీరికి ఒమిక్రాన్‌ సోకినట్టుగా ఇన్సాకాగ్‌ నెట్‌వర్క్‌ జన్యు విశ్లేషణలో తేలింది.

30 దేశాల్లో..

దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నవంబర్‌ 24న బయటపడిన ఒమిక్రాన్‌ వేరియెంట్‌ తొమ్మిది రోజుల్లోనే భారత్‌సహా 30 దేశాలకు వ్యాప్తి చెందింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 375 ఒమిక్రాన్‌ కేసుల్ని గుర్తించారు. డెల్టా కంటే అయిదు రెట్ల వేగంతో ఈ వేరియెంట్‌ వ్యాపిస్తోంది. దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 183 కేసులు బయటపడితే, ఆ తర్వాత స్థానాల్లో 50కి పైగా కేసులతో నార్వే, 33 కేసులతో ఘనా, 32 కేసులతో బ్రిటన్‌ ఉన్నాయి.
చ‌ద‌వండి: సంతాన సాఫల్య కేంద్రాల నియంత్రణ బిల్లు ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
దేశంలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు
ఎప్పుడు : డిసెంబర్‌ 2
ఎవరు    : కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ 
ఎక్కడ  : బెంగళూరు, కర్ణాటక

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Dec 2021 05:49PM

Photo Stories