Skip to main content

Nuclear Reactors: ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటు

Govt of India approves installation of ten nuclear reactors

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ పార్లమెంటుకు ఈ విషయాన్ని తెలిపారు.కర్ణాటక, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పా­రు. ఆయా రాష్ట్రాల్లోని అణు విద్యుత్‌ ప్లాంట్లలో కొత్త అణు రియాక్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థ శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ‘అణు రియాక్టర్ల ఏర్పాటు కోసం పీఎస్‌యూలను ప్రభుత్వం వినియోగిస్తుంది. లేదా ప్రత్యేక ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా వీటి ఏర్పాటుకు కసరత్తు జరుపుతుంది’ అని లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 17 Apr 2023 06:01PM

Photo Stories