Skip to main content

COVID-19: మూడేళ్ల చిన్నారులకూ టీకా వేయనున్న దేశం?

China Flag

దేశ జనాభాలో మూడొంతుల మందికి కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన చైనా ప్రభుత్వం.. ఐదు(హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్‌) ప్రావిన్సుల్లో 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వస్తుండటమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్‌ టీకాలను పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులిచ్చింది. ఈ వ్యాక్సిన్లను ఇప్పటికే చిలీ, అర్జెంటీనా, కాంబోడియా ప్రభుత్వాలు తమ దేశాల్లోని చిన్నారులకు ఇవ్వడం ప్రారంభించాయి.

ప్రపంచంలోనే అత్యధికంగా 140 కోట్లున్న చైనా జనాభాలో 100 కోట్ల మందికి పైగా అంటే 76 శాతం మందికి దేశీయంగా తయారైన సినోఫాం, సినోవాక్‌ టీకాలను ఇచ్చారు.

50 ఏళ్లు...

చైనాను ఒక దేశంగా ఐక్యరాజ్యసమితి గుర్తించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్‌ 25న నిర్వహించిన ప్రత్యేక సదస్సులో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ మాట్లాడారు. అంతర్జాతీయ నిబంధనలను ఏవో కొన్ని దేశాలు నిర్దేశించలేవని, ఐక్యరాజ్యసమితిలోని 193 సభ్యదేశాలు మాత్రమే కలిసికట్టుగా రూపొందిస్తాయని అన్నారు.
 

చ‌ద‌వండి: ఆఫ్రికాలోని ఏ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 3–11 ఏళ్ల మధ్య చిన్నారులకు కూడా టీకా వేయాలని నిర్ణయించిన దేశం?
ఎప్పుడు : అక్టోబర్‌ 25
ఎవరు    : చైనా
ఎక్కడ    : హుబే, ఫుజియాన్, హైనాన్, జెజియాంగ్, హునాన్‌ ప్రావిన్సుల్లో...
ఎందుకు : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Oct 2021 03:30PM

Photo Stories