Skip to main content

Indian Railway: రైల్వే ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు

indian railway revenue 2023

భారతీయ రైల్వే 2022–23 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2021–22 సంవత్సరం కంటే ఇది 25శాతం ఎక్కువ అని రైల్వేశాఖ వెల్లడించింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సరకు రవా­ణా ద్వారా రూ.1.62 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, అది క్రితం సంవత్సరం కంటే 15శాతం అధికమని పేర్కొంది. ప్రయాణికుల నుంచి రూ.63 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. ఇందులో 61శాతం వృద్ధి నమోదైందని, గతంలో ఎన్నడూ ఇంత భారీస్థాయి వృద్ధి కనిపించలేదని తెలిపింది. నిర్వహణ వ్యయ నిష్పత్తి (ఆపరేటింగ్‌ రేషియో) 98.14 శాతంగా నమోదైందని, సవరించిన అంచనాలకు లోబడే ఉందని రైల్వేశాఖ తెలిపింది. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 29 Apr 2023 07:08PM

Photo Stories