FM Nirmala Sitharaman: రెండేళ్ల పాటు 7.4 శాతం వృద్ధి
Sakshi Education
-ఎగుమతులకు మద్దతుగా నిలుస్తామని ప్రకటన
FM Nirmala Sitharaman
దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం మేర వృద్ధిని చూస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) ఇదే వృద్ధి రేటు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ముంబైలో ఆగష్టు 26 న ఎఫ్ఈ బెస్ట్ బ్యాంక్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వెలుపలి వైపు సవాళ్లు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాల్సిన తరుణం కాదన్నారు. ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా చూస్తే తమ సొంత అంచనాలు సైతం 7.4 శాతం వృద్ధిని సూచిస్తున్నట్టు చెప్పారు.