Skip to main content

దేశంలో సామాజిక వ్యాప్తి మొదలైంది: ఐఎంఏ

దేశంలో కోవిడ్‌–19 పరిస్థితి తీవ్రంగా ఉందనీ, కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) జూలై 18న తెలిపింది.
Current Affairs

‘దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతం’అని ఐఎంఏ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీకే మోంగా అన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమన్నారు.


ట్విట్టర్‌కు సీఈఆర్‌టీ–ఇన్ నోటీసులు

మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సైబర్‌ సెక్యూరిటీ నోడల్‌ ఏజెన్సీ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ–ఇన్‌) నోటీసు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని, వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు వ్యక్తులు హ్యాక్‌ చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో భారత్‌లో ఎవరెవరి ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయో చెప్పాలంటూ ట్విట్టర్‌కు సీఈఆర్‌టీ–ఇన్ జూలై 18న నోటీసు ఇచ్చింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కరోనా వైరస్‌సామాజిక వ్యాప్తి మొదలైంది
ఎప్పుడు : జూలై 18
ఎవరు : ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ)
ఎక్కడ : దేశంలో
Published date : 20 Jul 2020 05:33PM

Photo Stories