English Language: ఆంగ్లభాషా నైపుణ్యాల మెరుగుకు చర్యలు

ఉట్నూర్‌ రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ఐటీడీఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆంగ్లభాషా నైపుణ్యాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా విబా, లీఫ్‌ ఫర్‌ వర్డ్‌ సంస్థ సహకారంతో ముందుకెళ్తున్నామని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు.

ఆగ‌స్టు 28న‌ ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 3వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమం రూపొందించడం జరుగుతుందున్నారు.

చదవండి: IIIT Basara: ఆర్జీయూకేటీలో అవగాహన సదస్సు

ఎలిమెంటరీ రీడింగ్‌, అడ్వాన్స్‌డ్‌ రీడింగ్‌ స్థాయిలుగా రూపకల్పన చేయబడిందన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వసంత్‌రావు, సంస్థ సభ్యులు వీరనారాయణ, చైతన్య చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

#Tags