Skip to main content

APPSC Group 2 Prelims Exam Cut Off 2024 Update : ఈ సారి గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఎంపిక నిష్పత్తి 1:100..? దీనిపై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్షను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. అయితే గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పేప‌ర్ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింద‌ని అభ్య‌ర్థులు అంటున్నారు. అయితే APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఉండే అవ‌కాశం ఉంది.
25th February Group-2 Prelims Exam   Andhra Pradesh Public Service Commission   APPSC Group 2 Prelims Exam Cut Off Marks 2024   APPSC Group-2 Prelims Exam 2024

దీనిపైన ఏపీపీఎస్సీ వ‌ర్గాలు ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇంకా ఇవ్వ‌లేదు. అయితే APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే మంచిద‌ని గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కోరుతున్నారు. అయితే అభ్య‌ర్థులు విన్నపాలు మేర‌కు ఈ Cut Off పై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు సానుకులంగా ఉన్న‌ట్టు తెలిసింది. ఒక వేళ APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే.. Cut Off  Marks భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది.

☛ APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ఎప్పుడంటే..?
ఈ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఈసారి గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌కు అత్యధికంగా హాజరవడం విశేషం.గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

☛ APPSC Group 1 Hall Ticket 2024 : మార్చి 10వ‌ తేదీన గ్రూప్–1 హాల్ టికెట్లు విడుద‌ల‌.. 17వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షలు.. ఈ సారి పోటీ మాత్రం..

 

APPSC Group -2 మెయిన్‌ ఎగ్జామినేషన్‌ విధానం ఇలా..: 

APPSC Group-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.

Published date : 11 Mar 2024 10:36AM

Photo Stories