AP CM Jagan: ఏపీలో పల్లెకు ‘ఫ్యామిలీ డాక్టర్’
Sakshi Education
ఏపీలో గ్రామీణ వైద్యసేవల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. స్వాతత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి మారుమూల పల్లెల్లో సైతం ప్రజలను పరామర్శిస్తూ వ్యక్తిగత శ్రద్ధతో డాక్టర్లు వైద్య సేవలందించేలా భారీ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. గ్రామీణ ప్రజలకు వ్యక్తిగత శ్రద్ధతో సొంత ఊరిలోనే మెరుగైన వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను విస్తృతంగా దశలవారీగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. జూలై 13న తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
Also read; ప్రకృతి సేద్యంపై యూనివర్సిటీ
Published date : 14 Jul 2022 05:25PM