Job Mela: నిరుద్యోగులు జాబ్మేళాను వినియోగించుకోవాలి
Sakshi Education
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో జాబ్ మేళా వాల్ పోస్టర్లను పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్మోహన్ రావు ఆగస్టు 15న ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 2న ఎల్లారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిప్లమా, ఐటీఐ, డిగ్రీ చదివిన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నాయకులు చెన్న లక్ష్మణ్, ఆరిఫ్, అజర్, నారాయణ తదితరులున్నారు.
చదవండి:
Civil Service vacancies: అఖిల భారత సర్వీసుల్లో 3,400 ఖాళీలు...!
Railway Jobs: సదరన్ రైల్వేలో 790 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
Published date : 16 Aug 2023 03:58PM