Skip to main content

గుడ్‌న్యూస్: 1,100మంది యువ ఇంజనీర్లకు ‘ఎల్‌అండ్‌టీ ’ చాన్స్

న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీ 2021లో సుమారు 1,100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతున్న నియామకాల్లో భాగంగా.. ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఆఫర్లను అందించినట్టు చెప్పారు. ఏటా తాము 1,100 మందికిపైగా ఇంజనీర్లను నియమించుకుంటామని చెబుతూ.. అందులో 90 శాతం మంది ఐఐటీలు, ఎన్‌ఐటీల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన వారే ఉంటారని స్పష్టం చేశారు.
Published date : 28 Dec 2020 05:37PM

Photo Stories