Skip to main content

Andhra Pradesh: రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏ నగరంలో ఏర్పాటైంది?

AP Logo

కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌ చట్టం–1995లోని సెక్షన్‌ 83 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ట్రిబ్యునల్‌ ఏర్పాటు కాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న వక్ఫ్‌ ట్రిబ్యునల్‌నే ఏపీ కేసుల విచారణకు వినియోగించుకుంటున్నారు. దీని వల్ల విచారణలో జాప్యం జరుగుతోంది.

చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు..

వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 6న తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. 

  • బోర్ల కింద వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా అన్నదాతలకు అవగాహన కల్పించాలి
  • వరి పండిస్తే వచ్చే ఆదాయం చిరుధాన్యాల (మిల్లెట్స్‌) సాగు రైతులకు కూడా దక్కేలా చూడాలని, ఇందుకోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
  • మిల్లెట్స్‌ను అధికంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలి. చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయాలి.

జవాద్‌ తుపాను ఏ సముద్రం ఏర్పడింది?

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగుతున్న జవాద్‌ తుపాను డిసెంబర్‌ 6న మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌ తీరంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

చ‌ద‌వండి: లైట్‌ ఆటో జీఎంబీహెచ్‌తో ఒప్పందం చేసుకున్న రాష్ట్రం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Dec 2021 06:25PM

Photo Stories