Skip to main content

ravasi Bharatiya Divas: అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములుగా మారండి.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ప్రవాస భారతీయులు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన, విశిష్టమైన శక్తిగా ఎదిగారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌ కార్యక్రమంలో జ‌న‌వ‌రి 10వ తేదీ ఆమె ప్రసంగించారు. పట్టుదల, నిరంతర శ్రమతో ప్రవాసీలు విభిన్న రంగాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లలో స్వయం సమృద్ధ దేశంగా ప్రగతి సాధించాలని భారత్‌ లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఈ ప్రయాణంలో ప్రవాస భారతీయులంతా పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మీ శక్తి, అనుభవం, ఆలోచనలు, వ్యాపార వ్యూహాలు, పెట్టుబడులు, సాంకేతిక నిపుణత, విజ్ఞానాన్ని మాతృదేశ అభివృద్ధి కోసం వెచ్చించాలని సూచించారు.

Pravasi Bharatiya Divas: మధ్యప్రదేశ్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభం

Published date : 11 Jan 2023 03:50PM

Photo Stories